పోలీస్టేషన్లోనే ఇరు వర్గాల ఘర్షణ....! చిత్తూరు జిల్లా వి. కోటలో రెండు వర్గాల మధ్య ఘర్షణ ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది. స్వాతంత్య్ర దినోత్సవం రోజున మాంసపు దుకాణం నిర్వహిస్తున్నారని పోలీసులకు ఫిర్యాదు చేసిన భాజపా నాయకులపై దాడి జరిగింది. షాపు యజమాని వర్గం వారు ఫిర్యాదుదారులు పోలీస్టేషన్ ఆవరణలోనే గొడవకు దిగారు. పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. పలమనేరు డీఎస్పీ హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకుని సమీక్షించారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బలగాలను మోహరించారు.