అనంతపురం జిల్లా ధర్మవరం మండలం చిగిచెర్ల వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందారు. మృతులు ఇద్దరూ స్నేహితులు. వారిద్దరూ అనంతపురం నుంచి ధర్మవరం వైపు ద్విచక్ర వాహనంలో ప్రయాణిస్తుండగా.. ఎదురుగా వస్తున్న వ్యాన్ ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది.
ఈ ఘటనలో మృతి చెందిన యువకులు జగదీష్ (22), హోసన్న (23) లుగా పోలీసులు గుర్తించారు. వీరిద్దరూ టీటీసీ పూర్తి చేసి అనంతపురంలో డీఎస్సీ కోచింగ్ తీసుకుంటున్నారు. కోచింగ్ పూర్తి కావడంతో అనంతపురం నగరానికి చెందిన హోసన్న ద్విచక్ర వాహనంలో.. జగదీశ్ను స్వగ్రామమైన కొత్తచెరువు మండలం నారే పల్లికి తీసుకెళ్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది.