ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Kalava On Barath Bandu: 'భారత్​ బంద్​ను విజయవంతం చేయాలి'

By

Published : Sep 26, 2021, 7:00 PM IST

TDP leader Kalva Srinivasan
తెదేపా నేత కాలవ శ్రీనివాసులు ()

కేంద్ర ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ.. రేపు జరపనున్న భారత్​ బంద్​ను విజయవంతం చేయాలని తెదేపా, వామపక్షాలు పిలుపునిచ్చాయి. కేంద్రం రైతులు, ఉద్యోగులు, విద్యార్థులు, కార్మికుల వ్యతిరేక విధానాలకు పాల్పడుతుందని తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు కాలవ శ్రీనివాసులు ఆరోపించారు.

రైతులు, ఉద్యోగులు, విద్యార్థులు, కార్మికుల పట్ల కేంద్ర ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ.. రేపు తలపెట్టిన భారత్​ బంద్​ను విజయవంతం చేయాలని తెదేపా, వామపక్షాలు పిలుపునిచ్చాయి. నాయకులు, కార్యకర్తలు పెద్దసంఖ్యలో పాల్గొనాలని.. తెలుగుదేశం నేత కాలవ శ్రీనివాసులు కోరారు. నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని, లేదంటే కార్పొరేట్ శక్తులు మార్కెట్‌ను అధీనంలోకి తీసుకుంటాయని ఆందోళన వెలిబుచ్చారు.

ఇదీ చదవండీ..Nani Fire On Pawan: 'జగన్​పై విషం చిమ్మేందుకే పవన్‌ అవాకులు, చెవాకులు'

TAGGED:

ABOUT THE AUTHOR

...view details