ఆంధ్రప్రదేశ్

andhra pradesh

అనంతలో సినీతారల క్రికెట్​.. విన్నర్​ ఎవరంటే..!

By

Published : Sep 11, 2022, 10:30 PM IST

Movie Stars Played Cricket

Cini Stars Cricket: అనంతపురంలో సినీ తారలు క్రికెట్ ఆడి సందడి చేశారు. ఈ క్రికెట్ పోటీ కార్యక్రమానికి హాజరైన వెండితెర, బుల్లితెర నటీనటులు ఆభిమానులను అలరించారు.

Cini Stars Played Cricket In Anantapur: అనంతపురం జిల్లా కేంద్రంలో జరిగిన సినీ స్టార్స్ క్రికెట్ పోటీ అనంతపురం పీటీసీ మైదానంలో సందడిగా సాగింది. సే నో డ్రగ్స్.. సే నో ప్లాస్టిక్ అనే నినాదంతో ఈ క్రికెట్​ పోటీని నిర్వహించారు. క్రీసెంట్ క్రికెట్ కప్పు 20 20 అనే పేరుతో ఈ కార్యక్రమాన్ని క్రీసెంట్ క్రికెట్ కప్పు చైర్మన్ షకీల్ షఫీ ఆధ్వర్యంలో ఈ పోటీని నిర్వహించారు. బుల్లితెర నటీనటులు క్రికెట్ ఆడి సందడి చేశారు. ఈ కార్యక్రమానికి హాజరైన ప్రముఖ యాంకర్ అనసూయ అభిమానులతో ముచ్చటించారు. ఈ క్రికెట్​ పోటీల్లో ఓంకార్ జట్టు, ఆదర్శ జట్టు పాల్గొన్నాయి. ఇవీ రెండు తలపడగా ఆదర్శ జట్టు విన్నర్​గా నిలిచింది. గెలుపొందిన ఆదర్శ జట్టును తెదేపా నేత జేసీ ప్రభాకర్ రెడ్డి సన్మానించారు. అనంతరం విజేతలకు కప్పులు అందించారు.

అనంతపురం పీటీసీ మైదానంలో క్రికెట్​ ఆడి సందడి చేసిన సినీతారలు

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details