ఆంధ్రప్రదేశ్

andhra pradesh

అనంతపురం కోర్టు శతాబ్ది ఉత్సవాలు..పాల్గొననున్న హైకోర్టు సీజే

By

Published : Mar 27, 2021, 6:04 PM IST

అనంతపురం కోర్టు శతాబ్ది ఉత్సవాల్లో పాల్గొనేందుకు ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అనూప్ గోస్వామి నగరానికి విచ్చేశారు. అధికారులు ఘనస్వాగతం పలికారు.

AP High Court CJ Tour
అనంతపురానికి హైకోర్టు సీజే

అనంతపురంలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అనూప్ గోస్వామికి అధికారులు ఘన స్వాగతం పలికారు. అనంతపురం కోర్టు శతాబ్ది ఉత్సవాల్లో పాల్గొనటానికి జిల్లాకు వచ్చిన హైకోర్టు సీజే లేపాక్షి లో వీరభద్ర స్వామిని దర్శించుకొని నగరానికి విచ్చేశారు. జిల్లా న్యాయమూర్తి అరుణ సారిక, కలెక్టర్ గంధం చంద్రుడు, ఎస్పీ సత్య ఏసుబాబులు...సీజేను సాదరంగా ఆహ్వానించారు.

ABOUT THE AUTHOR

...view details