ఆంధ్రప్రదేశ్

andhra pradesh

పరిగి కేజీబీవీలో అనిశా అధికారుల తనిఖీలు

By

Published : Feb 24, 2021, 8:00 PM IST

పరిగి మండలంలో ఉన్న కేజీబీవీలో అనిశా అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఎస్​వో కార్యాలయంలో పలు రికార్డులను పరిశీలించారు.

acb raids
పరిగి మండలం కేజీబీవీలో అనిశా అధికారుల తనిఖీలు

అనంతపురం జిల్లా పరిగి మండలంలో కేజీబీవీ పాఠశాలపై అవినీతి నిరోధక శాఖ అధికారులు దాడులు చేశారు. పాఠశాలలోని ఎస్​వో కార్యాలయంలోని పలు రికార్డులను తనిఖీ చేశారు. బయట వ్యక్తులు లోపలికి రాకుండా గేట్లకు తాళాలు వేసి తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఎస్​వో రమాదేవి ఇంటి నుంచి రికార్డ్స్ తెప్పించుకొని పరిశీలించారు. పూర్తి వివరాల వెల్లడికి కొంత సమయం పడుతుందని ఏసీబీ అధికారులు చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details