Attack: పల్నాడు జిల్లా వినుకొండలో పాల వ్యాపారం చేసుకునే మహిళతో పాటు ఆమె కుటుంబ సభ్యులపై వైకాపా కౌన్సిలర్ దాడి చేశాడు. గత కొన్ని నెలలుగా వేధింపులకు పాల్పడుతున్న కౌన్సిలర్... నిన్న సాయంత్రం గొడవకు దిగాడు. పాల బూత్ ఖాళీ చేయిస్తానని బెదిరింపులకు దిగాడు. ఎందుకని ప్రశ్నించినందుకు ఘర్షణకు పాల్పడ్డాడు. ఈ క్రమంలో ఇరువురిని పోలీస్ స్టేషన్కు తరలించారు. ఆ తర్వాత కౌన్సిలర్ భార్య, కుమారుడు షాపులో ఉన్న తన భర్త, కుమారుడిపై దాడి చేశారని బాధిత మహిళ వాపోయారు. పోలీస్ స్టేషన్ ఎదుట ఉన్నా తమకు రక్షణ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.