ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Cherlagudem incident : చెల్లి, మేనకోడలిపై ఆకాశమంత ప్రేమతో.. అనంతలోకాలకు..

By

Published : Nov 14, 2022, 10:00 AM IST

Cherlagudem incident: తెలంగాణలో చెల్లెలు, మేనకోడలిపై ఉన్న ప్రేమ ఆ వ్యక్తిని అనంతలోకాలకు చేర్చింది. ఇద్దరు చెరువులో పడి గల్లంతయ్యారని తెలుసుకొని అతడు హతాశుడయ్యాడు. మేన కోడలి మృతదేహం లభ్యం కాగా.. చెల్లెలి కోసం చెరువులో దూకాడు. ఆమె కోసం గాలిస్తూనే అతను కూడా గల్లంతయ్యాడు. అనంతరం కాసేపటికే విగతజీవిగా మారిపోయాడు. ఈ దారుణ విషాద సంంఘన సంగారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది.

Cherlagudem incident
చెర్లగూడెం ఘటన

Cherlagudem incident: తెలంగాణలో సంగారెడ్డి జిల్లా కంది మండలం చెర్లగూడెంకు చెందిన ఆలకుంట జములయ్య, భార్య యాదమ్మ పిల్లలతో కలిసి అమీన్‌పూర్‌ నర్రెగూడలో ఉంటున్నారు. జములయ్య ఐలాపూర్‌ తండా పంచాయతీలో పని చేస్తుండగా.. భార్య యాదమ్మ ఇళ్లల్లో పనులుచేస్తోంది. వారికి ఇద్దరుకుమార్తెలు. చిన్న కుమార్తె లావణ్యతో కలిసి యాదమ్మ శనివారం మధ్యాహ్నం బట్టలు ఉతికేందుకు.. ఐలాపూర్‌ చెరువుకు వెళ్లింది. చెరువులో మునిగి ఇద్దరూ గల్లంతయ్యారు.

సాయంత్రం ఇంటికి వచ్చిన జములయ్య.. మరికొంత మందితో కలిసి శనివారం రాత్రి చెరువువద్దకు వెళ్లి చూడగా ఆచూకీ లభించలేదు. ఆదివారం ఉదయం లావణ్య మృతదేహం నీటిపై తేలింది. యాదమ్మ కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. విషయం తెలియడంతో బోడుప్పల్‌లో ఉండే యాదమ్మ సోదరుడు ఉసిరయ్య.. ఐలాపూర్‌ చెరువు వద్దకు వచ్చారు. గాలించేందుకు చెరువులోకి దిగాడు. ఎక్కువ లోతు, పిచ్చి మొక్కలు ఉండటంతో నీటిలో మునిగిపోయారు.

పోలీసులు ఇద్దరు గజ ఈతగాళ్లను రప్పించి గాలింపు చేపట్టగా.. సాయంత్రం ఉసిరయ్య మృతదేహం లభించింది. యాదమ్మ ఆచూకీ ఇంకా దొరకలేదు. లావణ్య, ఉసిరయ్య మృతదేహాలను పటాన్‌చెరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చెల్లెలు, మేనకోడల కోసం వచ్చిన ఉసిరయ్య మృతితో అతని భార్య.. గుండెలవిసేలా రోదిస్తోంది.

చెర్లగూడెం ఘటన

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details