ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ఆసక్తికరంగా మారిన డాక్టర్​ కిడ్నాప్​ కేసు.. తప్పించుకుని పోలీసుల చెంతకు చేరిన జంట

By

Published : Oct 7, 2022, 5:52 PM IST

Updated : Oct 7, 2022, 7:57 PM IST

కత్తులు, రాడ్లుతో ఇంటిపైకి దండెత్తారు.....తలుపును పగలగొట్టి మరీ ఇంటిలోకి ప్రవేశించారు. ఇంటిలో వస్తువులను ధ్వంసం చేశారు. ఆపై నవ వధువును బలవంతంగా తీసుకెళ్లిపోయారు. సినిమాల్లోనే కనిపించే ఇలాంటి ఘటనలు....నిజజీవితంలోనూ జరిగాయి. ప్రేమించి పెళ్లి చేసుకున్న ఓ జంటకు ఇలాంటి పరిస్థితే ఎదురైంది.

DOCTOR KIDNAP
DOCTOR KIDNAP

DOCTOR KIDNAP : తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం బుచ్చినాయుడుపల్లికి చెందిన మోహనకృష్ణ, గుంటూరు జిల్లాకు చెందిన డాక్టర్‌ సుష్మ రెండు వారాల కిందట ప్రేమ వివాహం చేసుకున్నారు. సుష్మా తల్లి గుంటూరు జిల్లాలో మాజీ సర్పంచ్‌ కాగా...తండ్రి వైకాపా నాయకుడు. ఈ వివాహం ఇష్టం లేని సుష్మ తల్లిదండ్రులు ప్రేమ జంట నివాసం ఉంటున్న మోహన్‌కృష్ణ ఇంటికి వచ్చి తిరిగి వచ్చేయాలని సంప్రదింపులు జరిపారు. సుష్మ అంగీకరించకపోవడంతో వెళ్లిపోయి....తిరిగి వచ్చి ఉదయం మోహన్‌కృష్ణ ఇంటిపైకి దాడికి దిగారు. ఇంటి తలుపులు పగులగొట్టి విధ్వంసం సృష్టించి...కూతురు సుష్మను బలవంతంగా కారులో తీసుకెళ్లారు.

గుంటూరు నుంచి వచ్చి ఇంటిపై దాడి చేయడంతో పాటు యువతిని తీసుకెళ్లడాన్ని మోహనకృష్ణ చంద్రగిరి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న చంద్రగిరి పోలీసులు వివరాలు సేకరించారు. ప్రేమ వివాహం నచ్చని సుష్మ తల్లిదండ్రులు... ఆమెను బలవంతంగా తీసుకెళ్లారని కిడ్నాప్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఇంతలోపే తల్లిదండ్రుల నుంచి తప్పించుకొన్న సుష్మ...గుంటూరు నుంచి ప్రైవేటు వాహనంలో తిరుపతికి వచ్చారు. రక్షణ కల్పించాలంటూ ప్రేమ జంట తిరుపతి ఎస్పీని ఆశ్రయించారు.

ప్రేమ జంట ఫిర్యాదు మేరకు తిరుపతి పశ్చిమ డీఎస్పీ కేసు నమోదు చేశారు. జంట మేజర్లు కావడంతో నూతన వధూవరులకు రక్షణ కల్పిస్తామని తెలిపారు. గుంటూరు నుంచి తప్పించుకున్న సుష్మా మళ్లీ తిరుపతికి వచ్చింది. భర్తతో కలిసి ఎస్పీ పరమేశ్వర్ రెడ్డిని ఆశ్రయించింది. తమ కుటుంబ సభ్యులకు కాపాడాలని కోరింది.

డాక్టర్​ కిడ్నాప్​

ఇవీ చదవండి:

Last Updated : Oct 7, 2022, 7:57 PM IST

ABOUT THE AUTHOR

...view details