ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Miyapur gang rape case: సామూహిక అత్యాచారం కేసు.. ఆరుగురికి యావజ్జీవం

By

Published : Aug 24, 2021, 10:55 AM IST

తెలంగాణ రంగారెడ్డి జిల్లా మియాపూర్ పీఎస్ పరిధిలో రెండేళ్ల క్రితం జరిగిన అత్యాచారం కేసులో (Miyapur gang rape case) ఎల్బీనగర్ న్యాయస్థానం ఆరుగురికి జీవిత ఖైదు విధించింది. 2019 జనవరి 19న యువజంటను అటకాయించి... యువతిపై ఏడుగురు సామూహిక అత్యాచారం చేశారు. విచారణ జరిపిన న్యాయస్థానం నిందితులకు జీవితఖైదు విధిస్తూ తీర్పునిచ్చింది. బాల నేరస్థుడిపై విచారణ కొనసాగుతోంది.

gang-rape
gang-rape

యువజంటను అటకాయించి, యువతిపై సామూహిక అత్యాచారానికి (Miyapur gang rape case) పాల్పడిన కామాంధులకు న్యాయస్థానం జీవితఖైదు విధిస్తూ సోమవారం తీర్పునిచ్చింది. ముద్దాయిలకు రూ.20,000 చొప్పున జరిమానా విధించింది. తెలంగాణ రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం న్యూహఫీజ్‌పేట్‌ ఆదిత్యనగర్‌కు చెందిన షేక్‌ షౌకత్‌(35), మహ్మద్‌ ఖాలిద్‌ అలియాస్‌ అబ్బు(22), మహ్మద్‌ అఫ్రోజ్‌ అలియాస్‌ లాల్‌(20), అబ్దుల్‌ సల్మాన్‌ఖాన్‌ అలియాస్‌ రైడర్‌(20), షేక్‌ సల్మాన్‌(22), ముజాహిద్‌ఖాన్‌ అలియాస్‌ షారూఖ్‌(20), మరో బాలుడు(17) కలిసి 2019 జనవరి 19న రాత్రి 7 గంటల ప్రాంతంలో హఫీజ్‌పేట రైల్యే స్టేషన్‌ సమీపంలోని పొదల చాటున మద్యం తాగుతున్నారు.

ఆ సమయంలో అటుగా వెళ్తున్న యువజంటను వారంతా అటకాయించారు. యువతి(25)ని పొదల్లోకి లాక్కెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ప్రతిఘటించిన యువకుడిపై దాడి చేశారు. వారి ఆర్తనాదాలు విన్న స్థానికులు అక్కడికి చేరుకునేలోపే పరారయ్యారు. యువకుడి ఫిర్యాదు మేరకు మియాపూర్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. మూడు రోజుల్లోనే నిందితులను పట్టుకుని కోర్టులో హాజరుపరిచారు. పూర్తి ఆధారాలతో అభియోగ పత్రం దాఖలు చేశారు.

(Miyapur gang rape case) కేసు విచారణలో ఉండగానే నిందితులు ఫిర్యాదుదారైన యువకుడిని బెదిరించడంతో, అతను మానసిక క్షోభకు గురై ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీనిపైనా రాయదుర్గం పోలీసులు నిందితులపై మరో కేసు నమోదు చేశారు. అత్యాచారం కేసు విచారించిన రంగారెడ్డి జిల్లా ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక సెషన్స్‌ కోరు న్యాయమూర్తి జయలక్ష్మి ఆరుగురు నిందితులకు శిక్షలు ఖరారు చేస్తూ సోమవారం తీర్పు వెలువరించారు. కేసులో భాగస్వామిగా ఉన్న బాలుడిపై విచారణ కొనసాగుతోంది. న్యాయస్థానం తీర్పుపై సైబరాబాద్ సీపీ సజ్జనార్ హర్షం వ్యక్తం చేశారు. దర్యాప్తును పర్యవేక్షించిన మాదాపూర్ డీసీపీ వేంకటేశ్వర్లు, ఏసీపీలు రవికుమార్, కృష్ణప్రసాద్​లను సజ్జనార్ అభినందించారు.

ఇదీ చదవండి:

Ramya Murder case: గుంటూరుకు జాతీయ ఎస్సీ కమిషన్ బృందం

ABOUT THE AUTHOR

...view details