ద్విచక్ర వాహనాన్ని కారు ఢీ కొట్టింది. ఈ ఘటన.. అనంతపురం జిల్లా బత్తలపల్లి ఆర్డీటీ ఆసుపత్రి వద్ద జాతీయ రహదారిపై జరిగింది. ప్రమాదంలో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. జిల్లాలోని తాడిమర్రి మండలం మరిమాకుల పల్లి గ్రామానికి చెందిన గోపాల్ నాయుడు పని నిమిత్తం ద్విచక్ర వాహనంపై అనంతపురం బయల్దేరాడు.
లారీని ఓవర్ టేక్ చేసే సమయంలో ఎదురుగా వచ్చిన కారు అతని మోటారు సైకిల్ను వేగంగా ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడిన గోపాల్ ఘటనా స్థలంలోనే మృతి చెందాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని ధర్మవరంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.