ఆంధ్రప్రదేశ్

andhra pradesh

కర్ణాటక నుంచి అక్రమంగా మద్యం తరలింపు.. ఐదుగురి అరెస్టు

By

Published : Dec 31, 2022, 7:10 PM IST

Illegal liquor was seized by the police: చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గంలో కర్ణాటక నుంచి అక్రమంగా తరలిస్తున్న మద్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. ఈ ఘటనలో గంగవరం పోలీసులు ఐదుగురిని అరెస్టు చేశారు. నిందితులతో పాటు ద్విచక్ర వాహనం, కారు స్వాధీనం చేసుకున్నారు. వాహనాలు, మద్యం విలువ కలిపి ఏడు లక్షలు ఉంటుందని డీఎస్పీ సుధాకర్​రెడ్డి తెలిపారు.

Illegal liquor was seized by the police
కర్ణాటక నుంచి అక్రమంగా మద్యం తరలిస్తున్న ఐదుగురిని అరెస్టు చేసిన పోలీసులు

Illegal liquor was seized by the police: చిత్తూరు జిల్లా గంగవరం మండల కేంద్రంలో పోలీసుల వాహన తనిఖీల్లో భాగంగా.. కర్ణాటక నుంచి అక్రమ మద్యంతో వస్తున్న కారు మరో ద్విచక్రవాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. బెంగళూరు చెన్నై రహదారిపై పోలీసుల విధులు నిర్వహిస్తున్నారు. అదే సమయంలో కర్ణాటక నుంచి అనుమానాస్పదంగా ద్విచక్రవాహనం, కారు వస్తుండగా తనిఖీ చేశారు. ఈ క్రమంలో వాహనాల్లోని ఒకరు పరారు కాగా మిగిలిన ఐదుగుర్నిఅదుపులోనికి తీసుకున్నారు . స్వాధీనం చేసుకున్న మద్యంతో పాటు సీజ్ చేసిన వాహనాల విలువ 7లక్షలు ఉంటుందని పోలీసులు వెల్లడించారు. ఈ కేసును ఛేదించిన పోలీసు సిబ్బందిని డీఎస్పీ సుధాకర్ రెడ్డి అభినందించారు

ABOUT THE AUTHOR

...view details