ఆంధ్రప్రదేశ్

andhra pradesh

విద్యార్థినులను వేధిస్తున్న నలుగురు నిందితులు అరెస్టు..ఎక్కడంటే?

By

Published : Jan 7, 2023, 10:52 PM IST

Four arrested for harassing female students of engineering college: ఇంజినీరింగ్ కళాశాలలో విద్యార్థినులను వేధిస్తున్న నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు. సామాజిక మాధ్యమాల్లో కొన్ని గ్రూప్స్‌ ఏర్పాటు చేసి, వేధిస్తున్నారని రాచకొండ సీపీ చౌహన్ వివరాలను వెల్లడించారు. మొదటగా ఒక్క అమ్మాయితో పరిచయం ఏర్పరుచుకుని, ఆ తరువాత బ్లాక్‌మెయిల్‌ చేయటం ప్రారంభిస్తారన్నారు.

RACHAKONDA CP
విద్యార్థినులను వేధిస్తున్న నలుగురు విద్యార్థులు అరెస్టు

Four arrested for harassing female students of engineering college: హైదరాబాద్‌లోని ఓ ఇంజినీరింగ్‌ కళాశాలలో విద్యార్థినులను వేధిస్తున్న నలుగురు నిందుతుల్ని పోలీసులు అరెస్టు చేశారు. ఒక అమ్మాయితో మొదటగా పరిచయం ఏర్పరుచుకుని ఆమెను బ్లాక్‌మెయిల్‌ చేసి... ఆమె ద్వారా ఇతర అమ్మాయిల నంబర్లను తీసుకుంటున్నారని రాచకొండ సీపీ చౌహన్‌ తెలిపారు. సామాజిక మాధ్యమాల్లో గ్రూప్స్‌ ఏర్పాటు చేసి వారిని వేధిస్తున్నారని పేర్కొన్నారు. ఈ ఘటన ఇటీవల వచ్చిన ఓ చిత్రంలోని సన్నివేశాలను తలపిస్తున్నాయన్నారు.

విద్యార్థినులను వేధిస్తున్న నలుగురు అరెస్టు..ఎక్కడంటే?

అనంతరం సైబర్‌ నేరాలపై ఆ కళాశాలలో అవగాహన కల్పించామని తెలిపారు. నిందితులను అదుపులోకి తీసుకుని వారిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశామన్నారు. అమ్మాయిలను సామాజిక మాధ్యమాల్లో వేధిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని, ప్రతి కళాశాలలో సైబర్‌ నేరాలపై అవగాహన కల్పిస్తామని ఆయన వెల్లడించారు.

అమ్మాయిలను వేధిస్తున్నారని తెలుసుకొని మేము లోతుగా పరిశీలించాం. మొబైల్​ డాటా ద్వారా కనిపెట్టాం. ముందు ఒక అమ్మాయితో పరిచయం ఏర్పరచుకొని తరువాత తన స్నేహితులను వేధిస్తున్నారు. ఈ కారణంగా వారిని అరెస్టు చేశాము. ప్రతి కళాశాల్లో సైబర్​ నేరాలపై అవగాహన కల్పించేలా కార్యక్రమాలు చేపడతాము. -చౌహన్‌, రాచకొండ సీపీ

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details