ఆంధ్రప్రదేశ్

andhra pradesh

గుంటూరు జిల్లాలో యువకుడి ఘాతుకం.. ఎంబీబీఎస్​ విద్యార్థిని హత్య

By

Published : Dec 5, 2022, 9:57 PM IST

Updated : Dec 5, 2022, 10:51 PM IST

crime
crime

21:54 December 05

బ్లేడుతో చేయి కోసుకున్న జ్ఞానేశ్వర్

గుంటూరు జిల్లాలో యువకుడి ఘాతుకం

గుంటూరు జిల్లా పెదకాకాని మండలం తక్కెళ్లపాడులో దారుణం జరిగింది. ఎంబీబీఎస్​ విద్యార్థినిపై సర్జికల్‌ బ్లేడుతో జ్ఞానేశ్వర్ అనే యువకుడు దాడి చేశాడు. దాడిలో గాయపడిన విద్యార్థిని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. దాడి చేశాక అదే బ్లేడుతో జ్ఞానేశ్వర్ తన చేయిని కూడా కోసుకున్నాడు. జ్ఞానేశ్వర్‌ను పట్టుకుని పెదకాకాని పోలీసులకు స్థానికులు అప్పగించారు. నిందితుడు జ్ఞానేశ్వర్ ఐటీ కంపెనీలో పని చేస్తున్నట్లు గుర్తించారు.

విద్యార్థిని మృతదేహం గుంటూరు జీజీహెచ్‌కు తరలించారు. యువతి స్వస్థలం, మిగతా విషయాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.

Last Updated : Dec 5, 2022, 10:51 PM IST

ABOUT THE AUTHOR

...view details