ఆంధ్రప్రదేశ్

andhra pradesh

తెలంగాణ: సరుకులు కొని ఇంటికి వెళ్తుండగా ప్రమాదం.. భార్య మృతి

By

Published : Apr 6, 2021, 10:03 AM IST

తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా వనస్థలిపురం పోలీస్​ స్టేషన్​ పరిధిలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బైక్​పై వెళ్తున్న దంపతులను డీసీఎం ఢీకొట్టడంతో భార్య అక్కడికక్కడే మృతి చెందింది. భర్త పరిస్థితి విషమంగా ఉంది.

accident
ప్రమాదం

ద్విచక్ర వాహనంపై వెళ్తున్న భార్యాభర్తలను డీసీఎం ఢీ కొట్టడంతో భార్య అక్కడికక్కడే మృతి చెందింది. భర్తకు తీవ్ర గాయాలయ్యాయి. తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా వనస్థలిపురం పోలీస్​ స్టేషన్​ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది.

సరుకులు కొని..

హయత్​నగర్​కు చెందిన దంపతులు సరుకుల కోసం డీమార్ట్​కు వెళ్లి ద్విచక్రవాహనంపై తిరుగు ప్రయాణమయ్యారు. ఆటోనగర్​ వద్దకు రాగానే వెనుక నుంచి వస్తున్న డీసీఎం వారిని ఢీ కొట్టింది. దీంతో భార్య స్వాతి అక్కడికక్కడే మృతి చెందింది. భర్త పరిస్థితి విషమంగా ఉండటంతో ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

ఇదీ చదవండి:

ఆగి ఉన్న లారీని ఢీ కొట్టిన ద్విచక్రవాహనం... ఇద్దరు మృతి

ABOUT THE AUTHOR

...view details