ఆంధ్రప్రదేశ్

andhra pradesh

తెలంగాణలో మరో దారుణం... బాలికపై సామూహిక అత్యాచారం

By

Published : Jun 23, 2022, 3:50 PM IST

rape
rape ()

Rape in Telangana: తెలంగాణలో మరో దారుణం జరిగింది. జూబ్లీహిల్స్ ఘటన మరువక ముందే మరో బాలికపై సామూహిక అత్యాచారం జరిగింది. బాలిక కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని.. దర్యాప్తు చేపట్టారు.

తెలంగాణ రాష్ట్ర రాజధానిలో మరో దారుణమైన ఘటన చోటు చేసుకుంది. జూబ్లీహిల్స్ ఘటన మరవక ముందే రోజుకో దారుణం బయటకు వస్తోంది. హైదరాబాద్‌ ఛత్రినాక పరిధిలో బాలికపై సామూహిక అత్యాచారం జరిగింది. బాలిక వయసు 17 సంవత్సరాలు. ఆ బాలికపై ఇద్దరు యువకులు అత్యాచారం చేసినట్లు పోలీసుల వివరాల ప్రకారం తెలుస్తోంది.

ఇదీ జరిగింది...అలీ అనే యువకుడితో ఉప్పుగూడా ప్రాంతానికి చెందిన బాధిత బాలికకు పరిచయముంది. బాలికను ఇంటికి పిలిచి స్నేహితుడు అర్బాస్‌తో కలిసి అలీ అత్యాచారం చేశాడు. ఈ విషయంపై బాలిక కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. బాధితురాలిని భరోసా సెంటర్‌కు పంపించి దర్యాప్తు చేస్తున్నారు. నిందితులు అలీ, అర్బాస్‌ను అదుపులోకి తీసుకున్నారు. అయితే నిందితుల్లో ఒకరు బాధిత బాలిక బంధువుగా పోలీసులు గుర్తించారు.

ఇవీ చూడండి :

ABOUT THE AUTHOR

...view details