ఆంధ్రప్రదేశ్

andhra pradesh

తెలంగాణ: ఎమ్మెల్సీ ఎన్నికల్లో ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ గడువు

By

Published : Feb 26, 2021, 5:59 PM IST

తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో నామినేషన్ల ఉపసంహరణ గడుపు ముగిసింది. భాజపాలో చేరిన కపిలవాయి దిలీప్​తో పాటు మల్లారెడ్డి, లక్ష్మీ నారాయణ, మల్లారెడ్డి నామినేషన్లను ఉపసంహరించుకున్నారు.

mlc
తెలంగాణ: ఎమ్మెల్సీ ఎన్నికల్లో ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ గడువు

తెలంగాణలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసింది. హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ స్థానంలో ముగ్గురు అభ్యర్థులు ఉపసంహరించుకున్నారు. భాజపాలో చేరిన కపిలవాయి దిలీప్‌తో పాటు మల్లారెడ్డి, లక్ష్మీనారాయణ నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. ఈ స్థానంలో 93 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు.

మార్చి 14న రెండు ఎమ్మెల్సీ స్థానాలకు పోలింగ్‌ జరగనుంది. మార్చి 17న ఓట్ల లెక్కింపు చేపడతారు. ఈ స్థానంలో ప్రధాన పార్టీల అభ్యర్థులుగా తెరాస నుంచి సురభి వాణిదేవి, కాంగ్రెస్‌ - చిన్నారెడ్డి, భాజపా అభ్యర్థిగా రామచందర్‌రావు, తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు ఎల్​. రమణ, స్వతంత్ర అభ్యర్థిగా ప్రొఫెసర్​ నాగేశ్వర్​ బరిలో ఉన్నారు.

ఇవీచూడండి:మున్సిపల్​ ఎన్నికలపై మార్చి ఒకటిన ఎస్​ఈసీ అఖిలపక్ష సమావేశం

ABOUT THE AUTHOR

...view details