ఆంధ్రప్రదేశ్

andhra pradesh

పోలవరం ప్రాజెక్టు పూర్తిపై నీలినీడలు: గోరంట్ల బుచ్చయ్య చౌదరి

By

Published : Apr 24, 2022, 11:32 AM IST

Updated : Apr 24, 2022, 1:45 PM IST

Gorantla fires on YSRCP over polavaram issue: రంకెలేస్తే పోలవరం పూర్తికాదనే సంగతి మంత్రి రాంబాబు గ్రహించాలని.. తెదేపా నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి హితవు పలికారు. జగన్‌ పాలనలో పోలవరం ప్రాజెక్టు పూర్తిపై నీలినీడలు కమ్ముకున్నాయని విమర్శించారు.

Gorantla fires on YSRCP over polavaram issue
గోరంట్లు బుచ్చయ్య చౌదరి

Gorantla fires on YSRCP over polavaram issue: జగన్‌ పాలనలో పోలవరం ప్రాజెక్టు పూర్తిపై నీలినీడలు కమ్ముకున్నాయని.. తెదేపా సీనియర్‌ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. జగన్ తప్పుడు విధానాలు, అనాలోచిత నిర్ణయాల వల్లే పోలవరంలో ప్రస్తుత పరిస్థితికి కారణమని స్పష్టం చేశారు. ఇంతటి అసమర్థమైన, అవినీతిపరుడైన సీఎం దేశంలో ఎక్కడా లేరని ధ్వజమెత్తారు.

పోలవరం ప్రాజెక్టు పూర్తిపై నీలినీడలు కమ్ముకున్నాయి: గోరంట్ల బుచ్చయ్య చౌదరి

ప్రాజెక్టులపై మంత్రులకు ఏమాత్రం అవగాహన లేదని.. రంకెలేస్తే పోలవరం పూర్తికాదనే విషయాన్ని అంబటి రాంబాబు గ్రహించాలని హితవు పలికారు. వాస్తవాలు బయటపడకుండా పోలవరం వద్ద 144సెక్షన్ అమలు చేస్తున్నారని.. చేతకానితనంతో రాయలసీమను ఎండగడతున్నారని ఆక్షేపించారు.

Last Updated : Apr 24, 2022, 1:45 PM IST

ABOUT THE AUTHOR

...view details