ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ఐఎస్​ఐ ఉగ్రవాది ఇమ్రాన్ యూకుబ్​పై ఎన్​ఐఏ ఛార్జ్​షీట్

By

Published : Mar 12, 2021, 8:25 PM IST

గూఢచర్యం కేసులో అరెస్ట్​ అయిన ఐఎస్ఐ ఉగ్రవాది ఇమ్రాన్ యాకుబ్ గితెలిపై జాతీయ దర్యాప్తు సంస్థ అనుబంధ అభియోగ పత్రం దాఖలు చేసింది. విశాఖ తూర్పు నౌకాదళంలో రహస్యాలను రాబట్టేందుకు కుట్ర పన్నినట్లు వెల్లడించింది. ఈ మేరకు విజయవాడ ఎన్​ఐఏ ప్రత్యేక కోర్టులో అధికారులు ఛార్జ్​షీట్ దాఖలు చేశారు.

గూఢచర్యం కేసులో ఐఎస్​ఐ ఉగ్రవాది ఇమ్రాన్ యూకుబ్​పై ఎన్​ఐఏ ఛార్జ్​షీట్
గూఢచర్యం కేసులో ఐఎస్​ఐ ఉగ్రవాది ఇమ్రాన్ యూకుబ్​పై ఎన్​ఐఏ ఛార్జ్​షీట్

విశాఖ తూర్పు నౌకాదళంలో గూఢచర్యం కేసులో అరెస్ట్​ అయిన ఐఎస్ఐ ఉగ్రవాది ఇమ్రాన్ యాకుబ్ గితెలిపై జాతీయ దర్యాప్తు సంస్థ అనుబంధ అభియోగ పత్రం దాఖలు చేసింది. విజయవాడ ఎన్​ఐఏ ప్రత్యేక కోర్టులో అధికారులు ఛార్జ్​షీట్ దాఖలు చేశారు. ఐపీసీ సెక్షన్ 120 బి, 201 ప్రకారం అభియోగాలు నమోదు చేశారు. గూఢచర్యం కోసం భారత్​లో నిధులు వసూలు చేసి ఇతర నిందితులకు ఇచ్చినట్లు ఎన్​ఐఏ పేర్కొంది. పాకిస్థాన్​కు చెందిన ఇతర ఉగ్రవాదులతో కలిసి నౌకాదళ రహస్యాలను రాబట్టేందుకు కుట్ర పన్నినట్లు వెల్లడించింది. నౌకాదళంలోని ఉద్యోగులకు మరి కొందరు నిందితులకు గూఢచర్యం కోసం డబ్బు ఇచ్చినట్లు ఎన్ఐఏ అభియోగం నమోదు చేసింది.

TAGGED:

ABOUT THE AUTHOR

...view details