ఆంధ్రప్రదేశ్

andhra pradesh

మరోసారి ముంపు ముప్పు.. గోదావరికి పెరుగుతున్న వరద

By

Published : Aug 10, 2022, 10:04 PM IST

ఎగువన కురుస్తున్న భారీవర్షాల కారణంగా గోదావరి వరద ఉద్ధృతి పెరుగుతోందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ అంబేడ్కర్ తెలిపారు. స్టేట్ కంట్రోల్ రూమ్ నుంచి ఎప్పటికప్పుడు వరద ప్రవాహాన్ని పర్యవేక్షిస్తూ సంబంధిత జిల్లాల కలెక్టర్లకు సూచనలు జారీ చేస్తున్నామని ఆయన స్పష్టం చేశారు.

గోదావరికి పెరుగుతున్న వరద
గోదావరికి పెరుగుతున్న వరద

Godavari Floods: ఎగువన కురుస్తున్న భారీవర్షాల కారణంగా గోదావరి వరద ఉద్ధృతి పెరుగుతోందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ అంబేడ్కర్ తెలిపారు. ధవళేశ్వరం బ్యారేజి వద్ద ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 11.79 లక్షల క్యూసెక్కులు ఉందని ఉదయానికి రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉందని వెల్లడించారు. విపత్తు నిర్వహణా సంస్థలోని స్టేట్ కంట్రోల్ రూమ్ నుంచి ఎప్పటికప్పుడు వరద ప్రవాహాన్ని పర్యవేక్షిస్తూ సంబంధిత జిల్లాల కలెక్టర్లకు సూచనలు జారీ చేస్తున్నామన్నారు. రెండవ హెచ్చరిక వస్తే ప్రభావితం కానున్నమండలాలపై జిల్లాల యంత్రాంగాన్ని అప్రమత్తం చేశామని చెప్పారు.

సహాయ చర్యల్లో మొత్తం ఆరు బృందాలు ఉన్నట్లు అంబేడ్కర్ తెలిపారు. కోనసీమ జిల్లాలో ఒక ఎన్డీఆర్ఎఫ్, 2 ఎస్డీఆర్ఎఫ్ బృందాలు, అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఒక ఎన్డీఆర్ఎఫ్, ఒక ఎస్డీఆర్ఎఫ్, ఏలూరు జిల్లాలో ఒక ఎన్డీఆర్ఎఫ్ బృందం ఉన్నట్లు వెల్లడించారు. గోదావరితో పాటు కృష్ణా, తుంగభద్ర నదులు ఉద్ధృతంగా ఉన్నందున నదీ పరీవాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు.

కృష్ణమ్మ పరవళ్లు.. కృష్ణా నది పరివాహక ప్రాంతంలో వరద నీటి ప్రవాహం పెరిగే అవకాశం ఉండటంతో అధికారులు పరీవాహక ప్రాంతంలోని ప్రజల్ని అప్రమత్తం చేశారు. నాగార్జున సాగర్ ప్రాజెక్టు నుంచి 3 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేయనుండటంతో దిగువ ప్రాంతంలో అప్రమత్తత హెచ్చరికలు జారీ చేశారు. ఎగువన తుంగభద్ర, జూరాల, శ్రీశైలం నుంచి లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. నాగార్జునసాగర్ నుంచి పులిచింతల డ్యామ్​కు.. అక్కడినుంచి 12వ తేదీ ఉదయానికి ప్రకాశం బ్యారేజీకి నీరు చేరుకునే అవకాశముందని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం బ్యారేజీలోని 70 గేట్లనూ ఎత్తి.. సముద్రంలోనికి 70 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నట్టుగా జలవనరుల శాఖ అధికారులు స్పష్టం చేస్తున్నారు. వరద నీటి ప్రవాహాలు పెరగనున్న నేపథ్యంలో ప్రకాశం బ్యారేజీకి ఎగువన, దిగువన ఉన్న ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచనలు జారీ చేశారు.

ఇవీ చూడండి

ABOUT THE AUTHOR

...view details