ఆంధ్రప్రదేశ్

andhra pradesh

VACCINE BOOSTER DOSE IN AP: రాష్ట్రవ్యాప్తంగా నేటి నుంచి బూస్టర్ డోస్ పంపిణీ

By

Published : Jan 10, 2022, 3:36 AM IST

Updated : Jan 10, 2022, 6:14 AM IST

VACCINE BOOSTER DOSE IN AP: కరోనా మూడో వేవ్ ప్రమాదం పొంచి ఉన్నందున.. రాష్ట్రంలో నేటి నుంచి బూస్టర్ డోసు పంపిణీ ప్రారంభం కానుందని వైద్య శాఖ ప్రకటించింది. దీనికి సంబంధించి గ్రామ, వార్డు సచివాలయాల్లో టీకా అందుబాటులో ఉంటుందని వెల్లడించింది.

VACCINE BOOSTER DOSE IN AP
VACCINE BOOSTER DOSE IN AP

VACCINE BOOSTER DOSE IN AP: నేటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా హెల్త్ వర్కర్లు, ఫ్రంట్ లైన్ వర్కర్లకు బూస్టర్ డోస్ ఇవ్వనున్నట్లు ఆరోగ్య శాఖ అధికారులు ప్రకటించారు. ఇందుకోసం నేటి నుంచి 13 వరకు ప్రత్యేక డ్రైవ్ ఏర్పాటు చేశారు. వీరితో పాటు.. రాష్ట్రంలో 60 ఏళ్లు నిండిన వారికి సైతం బూస్టర్ డోసులు అందించేందుకు ఏర్పాట్లు చేశారు.

ఇప్పటికే రెండు డోసులు తీసుకోవడం పూర్తై.. 9 నెలలు గడిచిన వారికి టీకా ఇవ్వనున్నట్లు తెలిపారు. గతంలో ఏ రకమైన టీకా తీసుకున్నారో.. అదే టీకా మళ్లీ ఇవ్వనున్నట్లు వైద్యాధికారులు స్పష్టం చేశారు. ఇందుకోసం గ్రామ, వార్డు సచివాలయాల్లో టీకా పంపిణీ కార్యక్రమం జరుగుతుందని వెళ్లడించారు.

Last Updated :Jan 10, 2022, 6:14 AM IST

ABOUT THE AUTHOR

...view details