Corona cases in AP: రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య భారీగా పెరిగింది. గడిచిన 24గంటల్లో.. 24,280 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. 1,831 కరోనా బారిన పడ్డారు. ప్రస్తుతం రాష్ట్రంలో..7,195 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. 242 మంది కొవిడ్ నుంచి పూర్తిగా కోలుకున్నట్లు వైద్యారోగ్యశాఖ తెలిపింది.
17:18 January 11
రాష్ట్రంలో ప్రస్తుతం 7,195 కరోనా యాక్టివ్ కేసులు
చిత్తూరులో అత్యధిక కేసులు..
అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 467 కరోనా కేసులు నమోదు కాగా.. విశాఖ జిల్లాలో 295, కృష్ణా జిల్లాలో 190 కేసులు నమోదయ్యాయి. గుంటూరు జిల్లాలో 164, అనంతపురంలో 161, నెల్లూరులో 129, శ్రీకాకుళం జిల్లాల్లో 122 కొవిడ్ కేసులు నమోదయ్యాయి.
ఇదీ చదవండి:
night curfew in ap: రాష్ట్రంలో రాత్రి కర్ఫ్యూ వాయిదా.. ఎందుకంటే
Last Updated :Jan 11, 2022, 6:13 PM IST