ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Rayalaseema Lift Irrigation: 'ఉల్లంఘనపై చర్యలు తీసుకునే అధికారం ఎన్జీటీకి ఉందా ?'

By

Published : Sep 16, 2021, 6:38 PM IST

Updated : Sep 16, 2021, 9:42 PM IST

రాయలసీమ ఎత్తిపోతలపై ఎన్జీటీ చెన్నై బెంచ్‌ ముందు సుదీర్ఘ విచారణ
రాయలసీమ ఎత్తిపోతలపై ఎన్జీటీ చెన్నై బెంచ్‌ ముందు సుదీర్ఘ విచారణ

18:35 September 16

రాయలసీమ ఎత్తిపోతలపై ఎన్జీటీ చెన్నై బెంచ్‌ ముందు సుదీర్ఘ విచారణ

రాయలసీమ ఎత్తిపోతలపై ఎన్జీటీ చెన్నై బెంచ్‌ ముందు సుదీర్ఘ విచారణ జరిగింది. ఉల్లంఘనపై చర్యలు తీసుకునే అధికారం ఎన్జీటీకి ఉందా ? అనే అంశంపై ఏపీ వాదనలు వినిపించింది. ప్రజోపయోగ పనులు చేపట్టినందుకు జైలుకు పంపుతారా అని ఏపీ ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది వెంకటరమణి వాదనలు వినిపించారు. ఇప్పటివరకు చేసినవి డీపీఆర్, ఇతర పనుల కోసమేనన్న ప్రభుత్వం.. చేసిన పనులు పూడ్చమంటారా ? అని ఎన్జీటీని ప్రశ్నించింది. ప్రజోపయోగ పనులను ట్రైబ్యునల్‌ అర్థం చేసుకోవాలని విజ్ఞప్తి చేసింది. తప్పుదోవ పట్టించేలా తెలంగాణ ప్రభుత్వం ఎన్జీటీకి ఫొటోలు ఇచ్చిందని..తప్పుడు ఫొటోలు పంపిన తెలంగాణపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కోరింది.  

రాష్ట్ర ప్రభుత్వం లేవనెత్తిన అంశాలపై ఈనెల 21న పిటిషనర్ వాదనలు వినిపించనున్నారు. పిటిషనర్ తరఫున గవినోళ్ల శ్రీనివాస్, తెలంగాణ న్యాయవాదులు వాదనలు వినిపించనున్నారు.  

తెలంగాణ ఫిర్యాదు ఏంటంటే..

రాష్ట్ర ప్రభుత్వం​ చేపట్టిన రాయలసీమ ఎత్తిపోతల ( Rayalaseema Lift Irrigation) పథకానికి పర్యావరణ అనుమతులు మంజూరు చేయవద్దని కేంద్ర ప్రభుత్వాన్ని..తెలంగాణ ప్రభుత్వం కోరింది. ఈ మేరకు కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖకు లేఖ రాసింది. పర్యావరణ మంత్రిత్వ శాఖ ఎక్స్​పర్ట్ అప్రైజల్ కమిటీ సభ్యకార్యదర్శికి తెలంగాణ జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ కుమార్ లేఖ రాశారు. రాయలసీమ ఎత్తిపోతల పథకం ఎలాంటి నీటి కేటాయింపులు, అనుమతులు లేని అక్రమ ప్రాజెక్టు అని లేఖలో పేర్కొన్నారు.  బేసిన్ వెలుపలకు పెద్దమొత్తంలో నీటిని తరలించేందుకు రాయలసీమ ఎత్తిపోతల చేపట్టారని రజత్​ కుమార్​ తెలిపారు. రాయలసీమ ఎత్తిపోతలతో పర్యావరణంపై తీవ్ర ప్రభావం పడుతుందని... రోళ్లపాడు, గుండ్ల బ్రహ్మేశ్వరం, శ్రీ లంకామల్లేశ్వర, శ్రీ పెనుసిలా నరసింహ, శ్రీ రాజీవ్ గాంధీ నేషనల్ పార్క్, శ్రీ వెంకటేశ్వర వన్యప్రాణి సంరక్షణా కేంద్రాలు ప్రాజెక్టు కాల్వలకు పదికిలోమీటర్ల పరిధిలోపే ఉన్నాయని రజత్ కుమార్ తెలిపారు. అందుకు సంబంధించిన వివరాలు, ఛాయాచిత్రాలను లేఖతో జతపరిచారు.  

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (KRMB)కు ప్రాజెక్టు డీపీఆర్ ఇవ్వకుండా, తగిన అనుమతులు తీసుకోకుండా పనులు చేపట్టవద్దని ఎన్జీటీ గతంలోనే ఆదేశాలు ఇచ్చిందని తెలిపారు. 2020 అక్టోబర్​లో జరిగిన అత్యున్నత మండలి సమావేశంలోనూ కేంద్ర జలశక్తిశాఖ మంత్రి ముందు రాయలసీమ ఎత్తిపోతల అంశాన్ని తెలంగాణ ప్రస్తావించిందని... కేంద్ర జలసంఘం అనుమతులు వచ్చే వరకు ప్రాజెక్టు పనులు ఆపాలని కేంద్ర ప్రభుత్వం కూడా ఏపీని ఆదేశించిందని రజత్ కుమార్ లేఖలో వివరించారు. 

ఇదీ చదవండి

AP Cabinet: కీలక నిర్ణయాలకు మంత్రివర్గం ఆమోదం..అవి ఏంటంటే..

Last Updated :Sep 16, 2021, 9:42 PM IST

ABOUT THE AUTHOR

...view details