CBI on Lepakshi Case: అనంతపురం జిల్లాలో ప్రైవేటు కంపెనీ లేపాక్షికి 10వేల ఎకరాలను కట్టబెట్టడంలో జరిగిన కుట్రలో మంత్రులు, కార్యదర్శులతో పాటు అప్పటి ఏపీఐఐసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టరు, ఏపీ ఐఏఎస్ డి.మురళీధర్రెడ్డి భాగస్వామేనని సీబీఐ పేర్కొంది. జగన్తో పాటు అధికారులందరూ కలిసి ప్రైవేటు కంపెనీకి లబ్ధి చేకూర్చారని, అందుకు ప్రతిఫలంగా జగన్ కంపెనీల్లో ఇందూ గ్రూపు రూ.50 కోట్ల ముడుపులను పెట్టుబడుల రూపంలో పెట్టిందని పేర్కొంది. ప్రాజెక్టువల్ల ప్రైవేటు వ్యక్తులే లబ్ధి పొందారని, అంతేగానీ ప్రజలకు గానీ, ప్రభుత్వానికి గానీ ప్రయోజనం చేకూరలేదంది. జగన్ అక్రమాస్తుల వ్యవహారంలో సీబీఐ నమోదు చేసిన కేసును కొట్టివేయాలంటూ ఐఏఎస్ డి.మురళీధర్రెడ్డి దాఖలు చేసిన పిటిషన్పై జస్టిస్ ఉజ్జల్ భూయాన్ విచారణ చేపట్టారు. సీబీఐ తరఫున కె.సురేందర్ వాదనలు వినిపించారు. ‘ప్రాసిక్యూషన్కు రాష్ట్ర ప్రభుత్వం అనుమతించలేదన్న కారణంగా కేసును కొట్టివేయాలని పిటిషనర్ కోరుతున్నారు. నిజానికి రాష్ట్ర ప్రభుత్వం అనుమతి అవసరంలేదు. ఐఏఎస్ అధికారి ప్రాసిక్యూషన్కు కేంద్రం అనుమతి అవసరం. మేం అనుమతి కోరే నాటికి (2013)ఆయన ఐఏఎస్’ అని వివరించారు.
కంపెనీ లేకుండానే అనుమతులు