ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ఆగస్టు 1న శ్రీవారి పవిత్రోత్సవాల టికెట్లు విడుదల

By

Published : Jul 30, 2022, 10:22 AM IST

Tirumala
శ్రీవారి పవిత్రోత్సవాలు ()

ఆగస్టు 1న తిరుమల శ్రీవారి పవిత్రోత్సవాల టికెట్లు విడుదల కానున్నాయి. 600 టికెట్లు జారీ చేయనున్నట్లు తితిదే వెల్లడించింది. మూడ్రోజుల పాటు జరిగే స్నపన తిరుమంజ‌నం, చివ‌రిరోజు పూర్ణాహుతిలో పాల్గొనే అవకాశం కల్పించనున్నారు.

భక్తుల సౌకర్యార్థం శ్రీవారి వార్షిక పవిత్రోత్సవాల టికెట్లను తితిదే ఆగస్టు ఒకటిన ఉదయం 10గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నట్లు శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపింది. దాదాపు 600 టికెట్లను అందుబాటులో ఉంచనుంది. టిక్కెట్‌ ధర ఒకరికి రూ.2,500గా నిర్ణయించింది. పవిత్రోత్సవాలు ఆగస్టు 8 నుంచి 10వ తేదీ వరకు శ్రీవారి ఆలయంలో నిర్వహించనున్న విషయం తెలిసిందే. మరింత సమాచారం www.tirumala.org, www.tirupatibalaji.gov.in వెబ్‌సైట్‌లో చూడొచ్చు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details