ఆంధ్రప్రదేశ్

andhra pradesh

MADANAPALLE ACCIDENT: మదనపల్లెలో రెండు బైక్​లు ఢీ.. ముగ్గురు మృతి

By

Published : Jan 15, 2022, 12:43 PM IST

ఘోర రోడ్డు ప్రమాదం
ఘోర రోడ్డు ప్రమాదం ()

చిత్తూరు జిల్లాలో శుక్రవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు ద్విచక్రవాహనాలు ఢీ కొన్న ఘటనలో ముగ్గురు వ్యక్తులు మరణించారు.

చిత్తూరు జిల్లా మదనపల్లె ఐదో మైలు వద్ద శుక్రవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు ద్విచక్రవాహనాలు ఢీ కొని ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం క్షతగాత్రులను తిరుపతిలోని ఓ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఇవాళ ఉదయం ముగ్గురూ మృతి చెందారు. మృతులు ఇస్మాయిల్, సిద్ధిక్, శ్రీనివాసులుగా పోలీసులు గుర్తించారు. ఇస్మాయిల్, సిద్దిక్ వాల్మీకీపురం మండలం చింతపర్తివాసులు కాగా.. శ్రీనివాసులు స్వగ్రామం మదనపల్లె మండలం కొత్తవారిపల్లి. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీచదవండి.

ABOUT THE AUTHOR

...view details