ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ఖరీదైన బైక్​లు కొట్టారు.... పోలీసులకు చిక్కారు

By

Published : Jun 17, 2020, 6:32 PM IST

ఖరీదైన బైక్​లే వారి లక్ష్యం. వారికి నచ్చిన బండి కనిపించిందంటే ఇట్టే కొట్టేస్తారు. ఎవరికి దొరకరు... చిక్కరు. వారిపై నిఘా పెట్టిన పోలీసులు ఎట్టకేలకు ఆ కేటుగాళ్లను పట్టుకున్నారు. వారినుంచి సుమారు రూ.11 లక్షల విలువ చేసే 17 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. నిందితులలో ఇద్దరు మైనర్లు కూడా ఉండటం విశేషం.

దొంగల ముఠాను అరెస్ట్​ చేసిన తిరుపతి పోలీసులు
దొంగల ముఠాను అరెస్ట్​ చేసిన తిరుపతి పోలీసులు

ద్విచక్రవాహనాలను చోరి చేసే ముఠాను తిరుపతి పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ.11 లక్షల విలువ చేసే 17 బైక్​లను స్వాధీనం చేసుకున్నారు. తిరుపతి అర్బన్ ఎస్పీ రమేష్ రెడ్డి తెలిపిన వివరాల మేరకు.... తిరుపతి నగరంలోని వైకుంఠపురం ఆర్చి సమీపంలో అనుమానాస్పదంగా తిరుగుతున్న యువకులను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. వారిని విచారించగా... ద్విచక్ర వాహనాల చోరీ గుట్టు బయటపడినట్లు పేర్కొన్నారు.

విచారణలో పలు ఆసక్తికర అంశాలు వెలుగులోకి వచ్చాయని... ఆరుగురు సభ్యులతో కూడిన ముఠా చిత్తూరు జిల్లా వ్యాప్తంగా పలు ప్రాంతాలలో బైక్​లను చోరీ చేసినట్లు గుర్తించామని చెప్పారు. చోరీలకు పాల్పడుతున్న ముఠాలో ఇద్దరు మైనర్​లు ఉన్నట్లు ఎస్పీ తెలిపారు. జీడి నెల్లూరు, తిరుపతి, చిత్తూరు నగరాలకు చెందిన ఆరుగురిని అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు. ప్రస్తుతం పట్టుబడిన వారిలో కొంతమందిపై తిరుపతి నగరంలోని పలు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయని వివరించారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.

ఇదీ చూడండి:తెలంగాణ నుంచి పాలక్యానులో అక్రమంగా మద్యం తరలింపు

ABOUT THE AUTHOR

...view details