ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Donation to TTD: తితిదేకు రూ.1.02 కోట్ల విరాళం.. ఎవరిచ్చారంటే..?

By

Published : Sep 21, 2022, 11:17 AM IST

donation to ttd
తితిదేకు భారీ విరాళం ()

తిరుమల శ్రీవారికి భారీ విరాళం వచ్చింది. ఆ విరాళం ముస్లిం కుటుంబం నుంచి రావడం విశేషం. చెన్నైకి చెందిన సుబీనాబాను, అబ్దుల్ ఘనీ దంపతులు శ్రీవారికి రూ.1.02 కోట్లు విరాళం అందజేశారు.

శ్రీవారికి చెన్నైకి చెందిన సుబీనా బాను, అబ్దుల్‌ ఘనీ దంపతులు తమ పిల్లలతో కలిసి మంగళవారం రూ.1.02 కోట్లు విరాళంగా అందించారు. ఆలయంలోని రంగనాయకుల మండపంలో దాతలు విరాళం చెక్కును తితిదే ఈవో ఏవీ ధర్మారెడ్డికి అందజేశారు. ఇందులో ఎస్వీ అన్నప్రసాదం ట్రస్టుకు రూ.15 లక్షలు, ఇటీవల తిరుమలలో ఆధునికీకరించిన శ్రీపద్మావతి విశ్రాంతి భవనంలో నూతన ఫర్నిచర్‌, వంటశాలలో పాత్రలకు రూ.87 లక్షలు విరాళంగా అందజేశారు. అంతకుముందు వారు శ్రీవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details