ఆంధ్రప్రదేశ్

andhra pradesh

37వ రోజు అమరావతి రైతుల మహా పాదయాత్ర... అర్బన్​ నియోజకవర్గంలోకి

By

Published : Oct 18, 2022, 9:50 AM IST

Updated : Oct 18, 2022, 10:37 AM IST

Amaravati Padayatra: 37వ రోజు రాజధాని రైతుల మహాపాదయాత్ర తూర్పు గోదావరి జిల్లాలో కొనసాగుతోంది. ఇవాళ దాదాపు 8 కిలోమీటర్ల మేర పాదయాత్ర కొనసాగనుంది. రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు... పాదయాత్రకు మద్దతు ప్రకటించాయి.

Amaravati Padayatra
మహాపాదయాత్ర

Amaravati Padayatra: అమరావతి రైతుల మహా పాదయాత్ర అలుపెరుగని పోరాటంగా ముందుకెళ్తోంది. ఇవాళ 37వ రోజు రాజధాని రైతుల యాత్ర... రాజమహేంద్రవరం పరిధి మల్లయ్యపేట నుంచి ప్రారంభమైంది. రాజమహేంద్రవరం మీదుగా అర్బన్ నియోజకవర్గంలో రైతుల పాదయాత్ర కొనసాగుతుంది. ఇవాళ దాదాపు 8 కిలోమీటర్ల మేర రైతుల పాదయాత్ర కొనసాగనుంది.

రైతులకు సంఘీభావంగా స్థానికులు భారీగా తరలివచ్చారు. రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు... పాదయాత్రకు మద్దతు తెలిపాయి. ఆదిరెడ్డి భవాని, ఆదిరెడ్డి అప్పారావు, ఆదిరెడ్డి వాసు, గోరంట్ల బుచ్చయ్యచౌదరి, జనసేన జిల్లా అధ్యక్షుడు కందుల దుర్గేశ్‌, సీపీఐ నేతలు... పాదయాత్రలో పాల్గొన్నారు.

ఇవీ చదవండి:

Last Updated :Oct 18, 2022, 10:37 AM IST

ABOUT THE AUTHOR

...view details