ఆంధ్రప్రదేశ్

andhra pradesh

నెల్లూరులో శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి శోభాయాత్ర.. అష్టాదశ శక్తిపీఠాల నుంచి సారె

By

Published : Sep 23, 2022, 10:06 PM IST

Shri Raja Rajeshwari Sobhayatra

దేశంలో ఉన్న పద్దెనిమిది శక్తి పీఠాలనుంచి నెల్లూరులోని శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారికి సారె పంపించారు. తితిదే కళ్యాణమండపం నుంచి రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయానికి.. ఆలయ నిర్వాహకులు ఊరేగింపుగా సారె తీసుకువెళ్లారు. దసరా పర్వదినాల్లో రోజుకు రెండు అలంకారాలు చొప్పున అలంకరించనున్నట్లు ఆలయ నిర్వాహకులు వెల్లడిచారు.

దసరా ఉత్సవాల్లో భాగంగా నెల్లూరులోని శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారు సారె అందుకున్నారు. దేశంలోని పద్దెనిమిది శక్తి పీఠాల నుంచి వచ్చిన చీర, సారెలను అమ్మవారి ఆలయానికి శోభయాత్రగా తీసుకొచ్చారు. ఈ కార్యక్రమంలో భక్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. మంగళవాయిద్యాలు, కోలాటాలతో ఊరేగింపు కన్నులవిందుగా నిర్వహించారు. దసరా పర్వదినాల్లో రోజుకు రెండు అలంకారాలు చొప్పున.. పద్దెనిమిది శక్తిపీఠాల్లోని అమ్మవార్ల అలంకారాలు ఆలయంలో ఏర్పాటు చేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details