ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Chandrababu Kadapa tour: ప్రాజెక్ట్‌ల నిర్వహణ లోపం.. నిర్లక్ష్యం వల్లే ప్రమాదం: చంద్రబాబు

By

Published : Nov 23, 2021, 4:03 PM IST

Updated : Nov 23, 2021, 6:14 PM IST

తెదేపా అధినేత చంద్రబాబు

తెదేపా అధినేత చంద్రబాబు కడప(Chandrababu tour in Kadapa) జిల్లాలో పర్యటిస్తున్నారు. వరద బాధితులను పరామర్శించారు. సాగునీటి ప్రాజెక్ట్‌ల నిర్వహణ లోపం వల్లే వరద నీటిని తట్టుకోలేక కట్టలు తెగిపోతున్నాయని చంద్రబాబు విమర్శించారు. వరదలతో తీవ్ర నష్టం వాటిల్లిందని ఆవేదన వ్యక్తం చేశారు. బాధితులకు తెదేపా అండగా ఉంటుందని చెప్పారు.

చంద్రబాబు

సాగునీటి ప్రాజెక్ట్‌ల నిర్వహణ లోపం వల్లే వరద నీటిని తట్టుకోలేక కట్టలు తెగిపోతున్నాయని తెదేపా అధినేత చంద్రబాబు విమర్శించారు. కడప జిల్లాలో వరద ప్రభావిత ప్రాంతాల్లో ఆయన పర్యటించారు. రాజంపేట మండలం మందపల్లిలో వరద బాధితులను పరామర్శించారు. పింఛా ప్రాజెక్ట్‌ నిర్వహణ సరిగా లేకపోవడంతో.. వరద నీరు అన్నమయ్య ప్రాజెక్ట్‌కు పోటెత్తి కట్ట తెగిపోయిందని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మందపల్లిలో ఒకే కుటుంబంలో 9మంది మృతి చెందారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికీ ప్రభుత్వం ఎలాంటి సహాయ సహకారాలు అందించడం లేదని మండిపడ్డారు. పులపుత్తూరు, గుండ్లూరులోనూ చంద్రబాబు పర్యటించారు.

రేపు చిత్తూరు జిల్లాలో పర్యటన

రేపు ఉదయం చిత్తూరు జిల్లాలోని రేణిగుంట రహదారిలో ముంపునకు గురైన ఆటోనగర్‌ ప్రాంతాన్ని చంద్రబాబు(Chandrababu Chittoor Tour) పరిశీలించనున్నారు. అనంతరం లక్ష్మీపురం కూడలి, ఎమ్‌ఆర్‌పల్లె, శ్రీకృష్ణానగర్‌, సరస్వతినగర్‌, గాయత్రినగర్‌, దుర్గానగర్‌ ప్రాంతాల్లో వరదప్రభావిత ప్రాంతాలకు వెళ్తారు. ముంపు బాధితులతో చంద్రబాబు మాట్లాడనున్నారు. తిరుచానూరు సమీపంలో కోతకు గురైన స్వర్ణముఖి నదిపై నిర్మించిన వంతెనను పరిశీలించనున్నారు. గురువారం నెల్లూరు జిల్లాలో పర్యటిస్తారు.

ఇదీ చదవండి:

KONDAPALLI: రేపు కొండపల్లి మున్సిపల్‌ ఛైర్మన్‌ ఎన్నిక జరపాలని హైకోర్టు ఆదేశం

Last Updated :Nov 23, 2021, 6:14 PM IST

ABOUT THE AUTHOR

...view details