ఆంధ్రప్రదేశ్

andhra pradesh

woman falls moving bus: తాను దిగిన బస్సు కిందే పడి... మహిళ మృతి

By

Published : Mar 22, 2022, 7:51 PM IST

woman falls from moving bus: బస్సు కింద పడి మహిళ మృతిచెందిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అదే బస్సులో ప్రయాణించిన మహిళ బస్సు దిగి ముందు నుంచి నడుస్తూ వెళ్లింది. అది గమనించకుండా డ్రైవర్‌ బస్సు నడపడంతో... ముందు టైర్ల కింద పడి మహిళ చనిపోయింది.

woman falls from moving bus
బస్సు కింద పడి మహిళ మృతి

బస్సు కింద పడి మహిళ మృతి

woman falls from moving bus: ఓ మహిళ ఆర్టీసీ బస్సులో ప్రయాణించి... అదే బస్ కింద పడి మృతి చెందిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 21 రోజుల కిందట తెలంగాణలోని హైదరాబాద్‌ ఆఫ్జల్ గంజ్ పోలీసు స్టేషన్​ పరిధిలో.. ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదానికి సంబంధించిన సీసీ కెమెరా దృశ్యాలను పోలీసులు విడుదల చేశారు.

చంచల్ గూడా జేకే టవర్స్ ప్రాంతానికి చెందిన సిరాజ్ బాను... మార్చి 1న ఇంటికి వస్తూ ఆర్టీసీ బస్సు ఎక్కారు. సిద్ది అంబర్ బజార్ వంతెన వద్ద... డ్రైవర్ సైదయ్య బస్సును ఆపాడు. సిరాజ్ బాను బస్సు దిగి.. రోడ్డు దాటేందుకు బస్సు ముందు నుంచే వెళ్తుండగా.. అది గమనించని డ్రైవర్ సైదయ్య ముందుకు నడిపాడు.

ప్రమాదవశాత్తు సిరాజ్ బాను బస్సు... ముందు చక్రాల కింద పడి... అక్కడికక్కడే మృతి చెందింది. దీంతో అఫ్జల్ గంజ్ పోలీసులు కేసు నమోదు చేసుకుని.. మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి కారణమైన బస్సు డ్రైవర్ సైదయ్యను... అరెస్టు చేసి రిమాండ్​కు తరలించారు.

ఇదీ చదవండి :Priest Murder: పశ్చిమగోదావరి జిల్లాలో పూజారి దారుణ హత్య

ABOUT THE AUTHOR

...view details