ఆంధ్రప్రదేశ్

andhra pradesh

తెదేపా నాయకులపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు: సీఐడీ ఏడీజీకి వర్ల ఫిర్యాదు

By

Published : Aug 5, 2022, 11:19 AM IST

Varla Ramaiah
వర్ల రామయ్య ()

Varla Ramaiah: తెదేపా నాయకులపై.. సామాజిక మాధ్యమాల్లో వైకాపా నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ పార్టీ పొలిట్‌ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. అవాస్తవాలు ప్రచారం చేస్తున్న.. విజయసాయిరెడ్డి, దేవేందర్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని సీఐడీ ఏడీజీకి ఫిర్యాదు చేశారు. అధికార పార్టీ నేతల ఆదేశాలతో నిందితులపై చర్యలు తీసుకునేందుకు స్థానిక పోలీసులు ఆసక్తి చూపడం లేదని విమర్శించారు.

Varla Ramaiah: తెదేపా నాయకులపై సామాజికమాధ్యమాల్లో తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ గుర్రంపాటి దేవేందర్ రెడ్డి, విజయసాయి రెడ్డిలపై సీఐడీ ఏడీజికి పార్టీ పొలిట్‌ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ఫిర్యాదు చేశారు. ఏపీ అటవీ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ హోదాలో ఉన్న గుర్రంపాటి దేవేంద్ర రెడ్డి.. నారా లోకేశ్​పై తప్పుడు ప్రచారం చేశారని ఆరోపించారు. రెండు రాజకీయ పార్టీల మధ్య శత్రుత్వం, ద్వేషం పెంచడమే దేవేంద్ర రెడ్డి ఉద్దేశంలా కనిపిస్తోందని మండిపడ్డారు. సామాజిక మాధ్యమాల్లో దేవేందర్ రెడ్డి ప్రచారం చేసినట్లుగా జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 45లో 273, 274, 275, 276 సర్వే నంబర్లే లేవని పేర్కొన్నారు. 3 ఆగస్టు 2022న ఎంపీ విజయ సాయిరెడ్డి సైతం తెదేపా నాయకుల హత్యారాజకీయాల పేరుతో తప్పుడు వార్తలు ప్రచారం చేశారని ధ్వజమెత్తారు. అధికార పార్టీ నేతల ఆదేశాలతో నిందితులపై చర్యలు తీసుకునేందుకు స్థానిక పోలీసులు ఆసక్తి చూపడం లేదని విమర్శించారు. ఫిర్యాదు చేసేందుకు వచ్చిన బాధితులపై అసభ్యంగా ప్రవర్తించినందుకు సీఐ భూషణంపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

"తెదేపా నాయకులపై సోషల్‌ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారు. లోకేశ్‌పై దేవేందర్‌రెడ్డి తప్పుడు ప్రచారం చేశారు. రెండు పార్టీల మధ్య ద్వేషం పెంచడమే దేవేందర్‌రెడ్డి ఉద్దేశంలా కనిపిస్తోంది. దేవేందర్‌రెడ్డి ప్రచారం చేసినట్లుగా అలాంటి సర్వే నంబర్లే లేవు. జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 45లో 273, 274, 275, 276 సర్వే నంబర్లే లేవు. 2022 ఆగస్టు 3న విజయసాయి కూడా తప్పుడు వార్తలు ప్రచారం చేశారు. తెదేపా నాయకుల హత్యా రాజకీయాల పేరుతో వార్తలు ప్రచారం చేశారు. అధికార పార్టీ నేతల ఆదేశాలతో నిందితులపై చర్యలు తీసుకోవట్లేదు. ఫిర్యాదు కోసం వచ్చిన బాధితులపై అసభ్యంగా ప్రవర్తించిన సి.ఐ. భూషణంపై క్రమశిక్షణా చర్యలు తీసుకోండి."-వర్ల రామయ్య, తెదేపా పొలిట్‌ బ్యూరో సభ్యుడు

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details