ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ప్రతి ఒక్కరు సేవా కార్యక్రమాలు చేయాలని మోదీ చెప్తుంటారు: అమిత్ షా

By

Published : Sep 17, 2022, 8:29 PM IST

Amit shah Hyderabad Tour: ప్రతి ఒక్కరు సేవా కార్యక్రమాలు చేయాలని ప్రధాని మోదీ చెప్తుంటారని కేంద్రహోంమంత్రి అమిత్​షా అన్నారు. ముఖ్యంగా దివ్యాంగులకు సాయం చేయడమంటే మోదీకి చాలా ఇష్టమని అమిత్​షా పేర్కొన్నారు. డబ్బు రూపంలో కంటే అవసరమైన వస్తురూపంలో సాయం చేయటం మంచిదన్నారు.

Amit shah Hyderabad Tour
కేంద్రహోంమంత్రి అమిత్​షా

కేంద్రహోంమంత్రి అమిత్​షా

Amit shah Hyderabad Tour: బడుగు బలహీనవర్గాల అభివృద్ది కోసం కేంద్రం అనేక కార్యక్రమాలు చేపడుతోందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అన్నారు. అందరికి కరెంట్, ఉచిత సిలిండర్లు, టాయిలెట్ల నిర్మాణాలతో పాటు సంక్షేమ కార్యక్రమాలు చేపట్టినట్లు అమిత్ షా వెల్లడించారు. చేతనైన మేర సహాయం చేయాలని భాజపా శ్రేణులకు మోదీ చెప్తుంటారని అమిత్​షా పేర్కొన్నారు. ప్రధాని మోదీ జన్మదినం పురస్కరించుకుని సికింద్రాబాద్​లో ​దివ్యాంగులకు ట్రై సైకిళ్లు, పరికరాలు పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి అమిత్‌షా ముఖ్యఅతిథిగా హాజరైనారు. సిక్‌ విలేజ్‌లోని క్లాసిక్ గార్డెన్‌లో దివ్యాంగులకు అవసరమైన ట్రై సైకిళ్లు, ఆట పరికరాలను ఆయన అందజేశారు. వాజ్‌పేయి ఫౌండేషన్, భారత్ సేవా సహకార్ ఆధ్వర్యంలో పరికరాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.

ప్రతి ఒక్కరు సేవా కార్యక్రమాలు చేయాలని మోదీ చెప్తుంటారని అమిత్ షా పేర్కొన్నారు. ముఖ్యంగా దివ్యాంగులకు సాయం చేయడమంటే మోదీకి చాలా ఇష్టం అని తెలిపారు. డబ్బు రూపంలో కంటే అవసరమైన వస్తురూపంలో సాయం చేయటం మంచిదన్నారు. అంధులు గుర్తించేలా మోదీ కొత్త నోట్లు తీసుకువచ్చారని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్​రెడ్డి, రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్, బండి సంజయ్, ఇతర భాజపా నేతలు పాల్గొన్నారు.

కాన్వాయ్​కు అడ్డొచ్చిన కారు

కాన్వాయ్​కు అడ్డొచ్చిన కారు:అంతకుముందు సికింద్రాబాద్‌ పరేడ్‌ గ్రౌండ్స్‌లో జరిగిన హైదరాబాద్‌ విమోచన దినోత్సవ కార్యక్రమంలో అమిత్​షా పాల్గొన్నారు. అనంతరం అక్కడి నుంచి హరిత ప్లాజా వైపు కేంద్రహోంమంత్రి అమిత్​షా కాన్వాయ్‌ వెళ్లిన సమయంలో ఓ ఘటన జరిగింది. హరిత ప్లాజా వద్ద ఆగిన సమయంలో అమిత్​షా కాన్వాయ్‌కు అడ్డంగా ఓ కారు వచ్చింది. దీంతో కొద్దిసేపు కాన్వాయ్‌ ముందుకు వెళ్లలేదు. సదరు వ్యక్తి కారును పక్కకు తీయకపోవడంతో భద్రతా సిబ్బంది ఆ వాహనం అద్దాలు పగలగొట్టారు. అమిత్‌షా కాన్వాయ్‌కు కారు అడ్డంగా పెట్టిన వ్యక్తిని మంచిర్యాల జిల్లా కాగజ్‌నగర్‌కు చెందిన శ్రీనివాస్‌గా గుర్తించారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details