ఆంధ్రప్రదేశ్

andhra pradesh

రాష్ట్ర విద్యుత్​ నియంత్రణ మండలికి ఇద్దరు సభ్యుల నియామకం

By

Published : Feb 21, 2020, 7:41 PM IST

రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి(ఈఆర్సీ)కి ఇద్దరు సభ్యులను ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శి నాగులపల్లి శ్రీకాంత్ ఉత్తర్వులు జారీ చేశారు.

ap logo
ap logo

ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలికి ఇద్దరు సభ్యులను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. పి.రాజగోపాలరెడ్డి, ఠాకూర్ రామ్ సింగ్​లను ఈఆర్సీ సభ్యులుగా నియమిస్తూ ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శి నాగులపల్లి శ్రీకాంత్ ఉత్తర్వులు ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ విద్యుత్ చట్టం-2003, సవరణ చట్టం-2106 ప్రకారం విద్యుత్ నియంత్రణ మండలికి సభ్యుల నియామకాన్ని చేపడుతూ నోటిఫికేషన్ జారీ చేశారు. ఐదేళ్ల పాటు ఈఆర్సీ సభ్యులుగా రాజగోపాల్ రెడ్డి, ఠాకూర్ రామ్​సింగ్​లు కొనసాగనున్నారు.

ఇదీ చదవండి

ABOUT THE AUTHOR

...view details