ఆంధ్రప్రదేశ్

andhra pradesh

mp kavitha: ఎన్నికల్లో డబ్బు పంపిణీ.. తెరాస ఎంపీ మాలోత్ కవితకు జైలుశిక్ష

By

Published : Jul 24, 2021, 5:06 PM IST

Updated : Jul 24, 2021, 6:11 PM IST

trs mp maloth kavitha
trs mp maloth kavitha

17:03 July 24

trs mp maloth kavitha

తెలంగాణలోని మహబూబాబాద్‌ పార్లమెంటరీ స్థానం తెరాస ఎంపీ మాలోత్‌ కవితకు ప్రజాప్రతినిధుల కోర్టు జైలు శిక్ష ఖరారు చేసింది. కవితకు ఆరు నెలల జైలు శిక్షతో పాటు రూ.10వేలు జరిమానా విధిస్తూ తీర్పు వెల్లడించింది. పార్లమెంట్‌ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఓటర్లకు డబ్బు పంచారన్న కేసులో ఎంపీ కవితపై 2019లో బూర్గంపహాడ్‌ పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైంది. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం కవితకు జైలు శిక్ష, జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించింది. కోర్టు తీర్పు మేరకు రూ. 10వేల జరిమానాను ఎంపీ చెల్లించారు. అనంతరం ఆమెకు ప్రజాప్రతినిధుల కోర్టు బెయిల్‌ మంజూరు చేసింది.

ఇదీ చదవండి

Viveka murder case: వివేకా హత్య కేసులో నా ప్రమేయం లేదు: ఎర్ర గంగిరెడ్డి

Last Updated :Jul 24, 2021, 6:11 PM IST

ABOUT THE AUTHOR

...view details