ఆంధ్రప్రదేశ్

andhra pradesh

YANAMALA: వైకాపా పాలనలో అప్పులు తప్ప.. ఆదాయం లేదు: యనమల

By

Published : Sep 12, 2021, 12:15 PM IST

Updated : Sep 13, 2021, 5:19 AM IST

tdp-yanamala
tdp-yanamala

12:14 September 12

పేదరికంలోకి మధ్యతరగతి ప్రజలు

   రాష్ట్రంలో ఆర్థిక అసమానతలు 32 నుంచి 43 శాతానికి పెరిగాయని.. ఫలితంగా మధ్యతరగతి ప్రజలు ఎక్కువగా పేదలుగా మారారని శాసనమండలిలో ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు పేర్కొన్నారు. ‘సుస్థిర అభివృద్ధి లక్ష్యాల్లో 2018-19లో మూడో స్థానంలో ఉంటే ఇప్పటికీ అదే స్థానంలో కొనసాగుతున్నాం. గతంలో మనకంటే వెనకబడిన రాష్ట్రాలు ప్రస్తుతం 1, 2 స్థానాలకు చేరాయి. సంక్షేమానికి చేసిన ఖర్చులోనూ ఏపీ.. దేశంలో 19వ స్థానంలో ఉంది’ అని ఆదివారం ఒక ప్రకటనలో వివరించారు.

   ‘వైకాపా అధికారంలోకి వచ్చాక రూ.2,68,335 కోట్ల అప్పు చేస్తే అందులో రూ.68,632 కోట్లే ప్రత్యక్ష నగదు బదిలీ పథకాలతో ప్రజలకు అందించారు. మిగిలిన రూ.1.99 లక్షల కోట్లు ఏం చేశారనే ప్రశ్నకు ప్రభుత్వం నుంచి సమాధానం లేదు. రెండేళ్లలో పెట్టుబడి వ్యయం కోసం ఖర్చు చేసింది రూ.31వేల కోట్లు మాత్రమే. లెక్కల్లో చూపని రూ.1.99 లక్షల కోట్లలో రూ.31వేల కోట్లు తీసేసినా రూ.1.68 లక్షల కోట్లకు సంబంధించిన లెక్కలేవి?’ అని ప్రశ్నించారు. 

ఇదీ చదవండి: కోలుకుంటున్న సాయితేజ్.. సర్జరీ అవకాశం!

Last Updated :Sep 13, 2021, 5:19 AM IST

ABOUT THE AUTHOR

...view details