Ind Vs Aus T20 Match: ఉప్పల్ స్టేడియం ప్రస్తుతం ఎలా ఉందో చూడండి!
Ind Vs Aus T20 Match: ఆదివారం జరిగే భారత్-ఆస్ట్రేలియా మూడో టీ20 మ్యాచ్కు సర్వం సిద్ధమవుతోంది. మ్యాచ్కు వేదికగా ఉన్న ఉప్పల్ స్టేడియంలో భారీ భద్రత ఏర్పాట్లు చేస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భద్రతా ఏర్పాట్లపై దృష్టి సారించారు. దీనికి సంబంధించి గురువారం సికింద్రాబాద్ జింఖానా మైదానంలో టికెట్ల అమ్మకం.. తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసిన విషయం తెలిసిందే. అలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నట్లు పోలీసులు చెబుతున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి జ్యోతికిరణ్ అందిస్తారు..
cricket