వైకాపా ప్రభుత్వ పాలనపై జనసేన అధ్యక్షుడు పవన్కల్యాణ్ ట్విట్టర్ వేదికగా తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి 6 నెలల పాలనను 6 ముక్కల్లో చెప్పాలంటే... విధ్వంసం, దుందుడుకుతనం, కక్ష సాధింపు, మానసిక ఆవేదన, అనిశ్చితి, విచ్ఛిన్నం అంటూ ధ్వజమెత్తారు. కూల్చివేత పర్వంతో మొదలైన వారి పాలన... ఉద్దేశపూర్వక వరద రాజకీయాలు చేసేవరకూ వెళ్లిందన్నారు.
కోడెలను ఆత్మహత్యకు పురిగొల్పారు...
పోలవరం కాంట్రాక్టు, విద్యుత్ ఒప్పందాల రద్దు, రాజధాని అమరావతి నిర్మాణం నిలుపుదల, సింగపూర్ ప్రభుత్వంతో ఒప్పందం రద్దు, ఆర్బిట్రేషన్లను పవన్ ప్రస్తావించారు. విపక్ష నాయకులు, కార్యకర్తలను కేసుల పేరుతో వేధిస్తున్నారని మండిపడ్డారు. మాజీ స్పీకర్ కోడెలను ఆత్మహత్యకు పురిగొల్పారని... జర్నలిస్టులను ఇబ్బంది పెట్టేలా జీవో తెచ్చారని వ్యాఖ్యానించారు.
కార్మికులకు ఉపాధి లేకుండా చేస్తారా?