తెలంగాణలోని రాజన్నసిరిసిల్ల జిల్లా గంభీరావుపేట శివారు మానేరువాగులో కొట్టుకుపోయిన ఆర్టీసీ బస్సును అధికారులు వెలికితీశారు. భారీ క్రేన్ ఉపయోగించి అయిదు రోజుల తర్వాత బస్సును బయటకు తీశారు.
డ్రైవర్ అత్యుత్సాహంతో..
గత నెల 30న సిద్దిపేటకు చెందిన ఆర్టీసీ బస్సు 23మంది ప్రయాణికులతో మానేరు వాగుపై ఉన్న లోలెవల్ వంతెనపై వెళ్తుండగా.. ప్రవాహ ఉద్ధృతికి వంతెన మధ్యలో చిక్కుకుపోయింది. ప్రయాణికులు కేకలు వేయడంతో.. స్థానిక రైతులు వారిని కాపాడారు. ప్రవాహ ఉద్ధృతి పెరగడం వల్ల బస్సు కొట్టుకుపోయింది.