ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ప్రాణహాని లేదు..మెరుగైన చికిత్స అందిస్తున్నాం: జగదీశ్​రెడ్డి

By

Published : Mar 22, 2021, 10:40 PM IST

కబడ్డీ పోటీల్లో గ్యాలరీ కూలిన ఘటనలో ఎవరికీ ప్రాణహాని లేదని తెలంగాణ మంత్రి జగదీశ్​రెడ్డి వెల్లడించారు. ప్రమాదం జరిగిన వెంటనే ఆస్పత్రి తరలించి.. మెరుగైన చికిత్స అందించినట్లు చెప్పారు. బాధితులకు తమ ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.

jagadesh reddy visited suryapet hospital
తెలంగాణ మంత్రి జగదీశ్​రెడ్డి

తెలంగాణ మంత్రి జగదీశ్​రెడ్డి

జాతీయ కబడ్డీ పోటీల ప్రారంభోత్సవంలో ప్రమాదం జరగడం దురదృష్టకరమని తెలంగాణ మంత్రి జగదీశ్​రెడ్డి అన్నారు. సూర్యాపేటలోని ఏరియా ఆస్పత్రిలో ఎమ్మెల్యేలు బొల్లం మల్లయ్య, చిరుమర్తి లింగయ్య, సైదిరెడ్డితో కలిసి బాధితులను పరామర్శించారు. ప్రమాదం జరిగిన వెంటనే క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించినట్లు తెలిపారు. ఎవరికీ ప్రాణహాని లేదన్నారు. క్షతగాత్రులను మెరుగైన చికిత్స అందించామని చెప్పారు. బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని జగదీశ్​రెడ్డి హామీ ఇచ్చారు.

సూర్యాపేటలో 47వ జాతీయ జూనియర్‌ కబడ్డీ క్రీడల ప్రారంభోత్సవంలో గ్యాలరీ కూలిపోయింది. సుమారు 150 నుంచి 200 మంది వరకు కాళ్లు, చేతులకు గాయాలయ్యాయి.

ABOUT THE AUTHOR

...view details