ఆంధ్రప్రదేశ్

andhra pradesh

NARA LOKESH TWEET: 'రాష్ట్ర ప్రజల రక్తాన్ని జలగలా పీలుస్తున్న సీఎం జగన్​..!'

By

Published : Nov 26, 2021, 11:21 AM IST

Updated : Nov 26, 2021, 12:03 PM IST

NARA LOKESH FIRES ON CM JAGAN: సీఎం జగన్ ప్రజల రక్తాన్ని జలగలా పీలుస్తున్నారని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మండిపడ్డారు. అలాగే రిజిస్ట్రేషన్ల కోసం అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారంటూ ట్వీట్ చేశారు.

NARA LOKESH TWEET ON REGISTRATIONS IN THE STATE
'రాష్ట్ర ప్రజల రక్తాన్ని సీఎం జలగలా పీలుస్తున్నాడు..!'

NARA LOKESH TWEET ON CM JAGAN: ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జలగలా ప్రజల రక్తాన్ని పీలుస్తున్నారని.... తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మండిపడ్డారు. ఎన్టీఆర్ హయాం నుంచి వివిధ ప్రభుత్వాలు పేదలకు ఇచ్చిన పక్కా ఇళ్లకు రిజిస్ట్రేషనంటూ.... 15 వందల కోట్ల రూపాయలు కొట్టేసే స్కెచ్ వేశారని ట్విట్టర్ ద్వారా ఆరోపించారు. అలాగే రిజిస్ట్రేషన్ల కోసం అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారంటూ ట్వీట్​కు ఓ వీడియోను కూడా జతచేశారు. ఎవరూ ఒక్క రూపాయి కూడా కట్టొద్దని, తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన వెంటనే ఉచితంగా రిజిస్ట్రేషన్ చేస్తామని హామీ ఇచ్చారు.

Last Updated : Nov 26, 2021, 12:03 PM IST

ABOUT THE AUTHOR

...view details