ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Pawan On Floods: ఇప్పుడు ఇసుక ప్రకటనలా..? ప్రభుత్వానికి ఇంగితజ్ఞానం ఉందా?: పవన్‌

By

Published : Nov 21, 2021, 3:37 PM IST

రాష్ట్ర ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు జనసేన అధినేత పవన్ కల్యాణ్(pawan kalyan fires on YCP Government ). వరదలతో ప్రజలు తీవ్ర ఇబ్బందుల్లో ఉంటే.. ఇసుకపై వ్యాపార ప్రకటనలు ఇవ్వటమేంటని ప్రశ్నించారు. అసలు ప్రభుత్వానికి ఇంగితజ్ఞానం ఉందా.. అని ట్విటర్ వేదికగా నిలదీశారు.

janasena chief pawan kalyan
janasena chief pawan kalyan

రాష్ట్ర ప్రభుత్వ చర్యలపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ తీవ్రంగా స్పందించారు(pawan kalyan fires on YCP Government over floods). రాష్ట్రంలో వరదల భీభత్సంతో ప్రజల ఇళ్లు, పశువులు, పంటలు కొట్టుకుపోతున్నాయని.. ప్రాణాలు కోల్పోతున్నారని.. పొలాల్లో ఇసుకమేటలు చూసి రైతులు ఏడుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి సమయంలో ఇసుక అమ్ముతాం అని ప్రకటనలు ఇవ్వటమేంటన్న జనసేనాని.. అసలు ఈ ప్రభుత్వానికి ఇంగితజ్ఞానం ఉందా..? అని ప్రశ్నించారు.

'రాష్ట్రంలో వరద బీభత్సం సృష్టిస్తోంది. ప్రజల ఇళ్లు, పశువులు, పంటలు కొట్టుకుపోతున్నాయి. పొలాల్లో ఇసుక మేటలు చూసి రైతులు ఏడుస్తున్నారు. ప్రభుత్వం ఇసుక అమ్ముతాం అని ప్రకటనలు ఇస్తోంది. ఈ ప్రభుత్వానికి ఇంగితజ్ఞానం ఉందా..?' - పవన్‌కల్యాణ్‌, జనసేన అధినేత

జల ప్రళయంతో చేతికొచ్చిన పంటలు కోల్పోయి.. రైతన్నలు బాధలో ఉంటే ఇసుకపై వ్యాపార ప్రకటనలు ఏమిటి..? అని ఆ పార్టీ రాజకీయ వ్యవహారల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ప్రశ్నించారు. వరదలతో జనం.. సాయం కోసం ఎదురుచూస్తుంటే ప్రచారం కావాల్సి వచ్చిందా..? నీరో తత్వం ఒంటబట్టిందా? అని ట్విటర్ వేదికగా నిలదీశారు.

భారీ వర్షాలతో రాయలసీమలోని మూడు జిల్లాలతో పాటు.. నెల్లూరు జిల్లాలో తీవ్ర నష్టం చోటుచేసుకుంది. 20 మందికి పైగా ప్రాణాలు నీళ్లల్లో కలిసిపోయాయి. చిత్తూరు, నెల్లూరు, కడపలో చెరువులు, డ్యామ్​లు నిండిపోవడంతో లోతట్టు ప్రాంతల ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. వరదలకు జరిగిన నష్టంపై శనివారం ప్రభుత్వం ప్రాథమిక అంచనాలు వెల్లడించింది.

ఇదీ చదవండి:

తెలంగాణ​ స్పీకర్‌ పోచారం మనవరాలి వివాహం.. హాజరైన జగన్, కేసీఆర్

ABOUT THE AUTHOR

...view details