ఆంధ్రప్రదేశ్

andhra pradesh

DISHA: దిశ నిందితుల ఎన్​కౌంటర్ కేసులో త్రిసభ్య కమిషన్‌ సుదీర్ఘ విచారణ

By

Published : Sep 3, 2021, 8:32 AM IST

investigation-ongoing-on-disha-encounter-case
దిశ నిందితుల ఎన్​కౌంటర్ కేసులో త్రిసభ్య కమిషన్‌ సుదీర్ఘ విచారణ ()

దిశ నిందితుల ఎన్​కౌంటర్​ కేసులో విచారణ కొనసాగుతోంది. సిట్​ దర్యాప్తు అధికారి సురేందర్​ రెడ్డిని సిర్పూర్కర్ కమిషన్ సుదీర్ఘంగా విచారించింది. ఇవాళ ఎన్​కౌంటర్ మృతుల కుటుంబ సభ్యుల సాక్ష్యం తీసుకోనుంది.

దిశ నిందితుల ఎన్​కౌంటర్ కేసులో సిట్ దర్యాప్తు అధికారి సురేందర్ రెడ్డిని సిర్పూర్కర్ కమిషన్ సుదీర్ఘంగా విచారించింది. సురేందర్ రెడ్డి విచారణ ముగిసిన తర్వాత దిశ హత్యాచారం కేసులో సాక్షిగా ఉన్న రాజశేఖర్ అనే ప్రభుత్వ ఉద్యోగిని కమిషన్ ప్రశ్నించింది. సురేందర్ రెడ్డిని ఆరు రోజుల పాటు ప్రశ్నించారు. గత నెల 21, 26,27,28 తేదీలతో పాటు... ఈ నెల 1,2 తేదీల్లో సురేందర్ రెడ్డిని ప్రశ్నించారు.

ఎన్​కౌంటర్ ఘటనకు సంబంధించి పలు అనుమానాలను కమిషన్ తరఫు న్యాయవాది లేవనెత్తగా... వాటికి సురేందర్ రెడ్డి సమాధానాలిచ్చారు. దిశ ఎన్​కౌంటర్ మృతుల కుటుంబ సభ్యుల నుంచి సాక్ష్యాలను ఇవాళ్టి నుంచి సేకరించే అవకాశం ఉంది.

ఇదీ చదవండి: దిశ నిందితుల ఎన్‌కౌంటర్ కేసులో కొనసాగుతున్న విచారణ

ABOUT THE AUTHOR

...view details