మచిలీపట్నం పోర్టు నిర్మాణంపై తెదేపా నేతలు చేస్తున్న ఆరోపణలపై మంత్రి పేర్ని నాని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. తెదేపా హయంలో పోర్టులో జరిగిన పనలు ఏమిటో చెప్పాలని డిమాండ్ చేశారు. ఎన్నికల వేళ హడావిడిగా పోర్టు నిర్మాణానికి శ్రీకారుం చుట్టారని ఆరోపించారు. బందరు పోర్టు తెలంగాణకు కట్టబెడుతున్నారంటూ చేస్తున్న ఆరోపణలు అర్థరహితమని స్పష్టం చేశారు. ఆర్టీ 62 జీవోని రహస్య జీవో అంటూ తెదేపా నాయకులు చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు. పోర్టు నిర్మాణ బాధ్యతలు చేపట్టిన సంస్థ వెనకడగు వేస్తే.. రాష్ట్ర ప్రభుత్వమే బందరు పోర్టును పూర్తి చేస్తుందని స్పష్టం చేశారు.
భాజపా నేతగా మాట్లాడారు..
పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో ఐదేళ్లలో రూ. 2300 కోట్ల అవినీతి జరిగిందని మంత్రి తెలిపారు. నిపుణుల కమిటీ ఆధారంగా ప్రభుత్వం విచారణ చేస్తోందని అన్నారు. గజేంద్రసింగ్ షెకావత్ కేంద్ర జలవనరులశాఖ మంత్రిగా కాకుండా భాజపా నేతగా పార్లమెంటులో మాట్లాడారని విమర్శించారు. వైకాపాకు ప్రత్యామ్నాయంగా భాజపా ఎదగాలనే రాజకీయ ఆకాంక్ష ఆయన మాటల్లో కనిపించిందని అన్నారు. పీపీఏల విషయంలో అవినీతి ప్రక్షాళన చేస్తున్న జగన్ను మెచ్చుకోకుండా విమర్శలు చేయటం సరికాదన్నారు.
Body:కరెంట్ షాక్
Conclusion:అనంతపురం జిల్లా