ఆంధ్రప్రదేశ్

andhra pradesh

IPS passing out parade 2021 in Hyderabad : జాతీయ పోలీస్‌ అకాడమీలో "దీక్షాంత్‌ సమారోహ్‌"

By

Published : Nov 12, 2021, 10:04 AM IST

హైదరాబాద్​ జాతీయ పోలీస్ అకాడమీలో "దీక్షాంత్ సమారోహ్"(Deekshanth Samaroh in National Police Academy) నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్(National security advisor Ajit Doval).. 73వ బ్యాచ్ ప్రొబెషనరీ ఐపీఎస్ అధికారులు పాసింగ్ అవుట్ పరేడ్​(IPS passing out parade 2021 in Hyderabad)లో గౌరవ వందనం స్వీకరించారు.

IPS passing out parade 2021 in Hyderabad
IPS passing out parade 2021 in Hyderabad

హైదరాబాద్ జాతీయ పోలీస్‌ అకాడమీ(National Police Academy)లో దీక్షాంత్‌ సమారోహ్‌(Deekshanth Samaroh in Hyderabad) ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్(National security advisor Ajit Doval) హాజరయ్యారు. 73వ బ్యాచ్ ప్రొబెషనరీ ఐపీఎస్ అధికారులు పాసింగ్ అవుట్ పరేడ్ నిర్వహించారు.

పరేడ్‌లో అజిత్ డోభాల్(National security advisor Ajit Doval) గౌరవ వందనం స్వీకరించారు. 73వ బ్యాచ్‌లో 149 మంది అధికారులు శిక్షణ పూర్తి చేసుకున్నారు. ఎస్​వీపీఎన్​ఏలో 132 మంది ఐపీఎస్​లతో పాటు మరో 17 మంది ఫారెన్ ట్రైనీ ఆఫీసర్లు ఉన్నారు. శిక్షణ పూర్తిచేసుకున్న వారిలో 27 మంది మహిళా ఐపీఎస్‌లు ఉన్నారు.

వరుసగా మూడోసారి పరేడ్‌ కమాండర్‌ అవకాశం మహిళా అధికారికే దక్కింది. పంజాబ్ క్యాడర్​కు చెందిన దర్పణ్ అహ్లువాలియా కమాండింగ్ ఆఫీసర్​గా వ్యవహరించారు. శిక్షణలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన వారికి అవార్డులు ప్రదానం చేశారు. ఈ బ్యాచ్​లో రాష్ట్రానికి నలుగురు ట్రైనీ ఐపీఎస్‌లను కేటాయించగా.. ఏపీకి ఐదుగురు ట్రైనీ ఐపీఎస్‌ల కేటాయించారు.

ABOUT THE AUTHOR

...view details