ఆంధ్రప్రదేశ్

andhra pradesh

తెలంగాణలోని యాదాద్రికి పోటెత్తిన భక్తులు.. కొండపైకి చేరేందుకు నానా అవస్థలు

By

Published : Oct 8, 2022, 3:48 PM IST

Problems in Yadadri temple: తెలంగాణలోని ప్రఖ్యాత పుణ్యక్షేత్రం యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహ స్వామీ వారి ఆలయానికి భక్తులు పోటెత్తారు. దసరా సెలవులు రావడంతో యాదాద్రిషుడి దర్శనానికి అధిక సంఖ్యలో భక్తులు మెుక్కులు తీర్చుకొనేందుకు వస్తున్నారు. కొండపైకి వెళ్లే బస్సులు కొద్ది సంఖ్యలో ఉండటంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పరిమితికి మించి భక్తులను బస్సులతో కొండపైకి తీసుకెళ్తున్నారని మండిపడుతున్నారు. మరోవైపు ఆలయ అధికారులు యాదాద్రిలో తిరుమల తరహాలో భక్తులకు క్యూలైన్లు ఏర్పాట్లు చేసేందుకు సిద్ధమయ్యారు.

Yadadri
యాదాద్రి

Problems in Yadadri temple: యాదాద్రి శ్రీ లక్ష్మి నరసింహ స్వామి ఆలయంలో భక్తుల రద్దీ పెరిగింది. స్వామివారి దర్శనానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఆలయ పరిసరాలు, ఘాట్‌ రోడ్డులో వాహనాలతో పూర్తిగా రద్దీగా మారింది. దీంతో ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడి రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. కొండపైకి చేరవేసేందుకు ఉచిత బస్సులు ఉన్నప్పటికీ.. అవి సరిపోవడం లేదని భక్తులు పేర్కొంటున్నారు. పరిమితికి మించి భక్తులను బస్సుల్లో ఎక్కించుకుంటున్నారని మండిపడుతున్నారు.

తిరుమల తరహాలో ఏర్పాట్లు:మరోవైపు యాదాద్రి దర్శనం.. తిరుమల తరహాలో కల్పించేందుకు ఆలయ అధికారులు ప్రయోగాత్మకంగా చర్యలు చేపట్టారు. కొండపైన ఉచిత దర్శన వరుసల కాంప్లెక్స్ నుంచి ఆలయ మాడ వీధి మీదుగా భక్తులను వరుస క్రమంలో తరలించే ప్రక్రియను చేపట్టారు. దర్శనానికి వేచి ఉండే భక్తులతో ఉచిత, ప్రత్యేక వరుసలు నిండిపోయి ఇక్కట్లు ఎదురవుతున్నాయి.

క్యూ కాంప్లెక్స్ నింపని పక్షంలో ఓకే సారి అధిక సంఖ్యలో భక్తులు ఆలయంలోకి వచ్చి చేరుతున్నారని ఆలయ అధికారులు తెలిపారు. క్యూలైన్లో నింపి.. కొద్ది కొద్ది మందిని వదలడం వల్ల దర్శనంకు వెసులుబాటు కలుగుతుందని.. సీఎం కేసీఆర్ సూచనలతో దర్శనం సులువుగా సాగేలా శ్రీకారం చుట్టినట్లు ఆలయ ఈవో గీత తెలిపారు.

యదాద్రిలో భక్తుల రద్దీ

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details