ఆంధ్రప్రదేశ్

andhra pradesh

'తొలిదశలో 1 నుంచి 6వ తరగతి వరకే ఆంగ్లమాధ్యమం'

By

Published : Nov 9, 2019, 1:00 PM IST

Updated : Nov 9, 2019, 4:17 PM IST

పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమ బోధనపై రాష్ట్ర ప్రభుత్వం కొద్దిమేర సవరిస్తూ నిర్ణయం తీసుకుంది. తొలిదశలో 1వ తరగతి నుంచి 6వ తరగతి వరకు మాత్రమే ఆంగ్లమాధ్యమాన్ని వర్తింప చేయాలంటూ ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు.

ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల ల్యాబ్​లు ఏర్పాటు చేయాలి

పాఠశాలల్లో ఆంగ్లమాధ్యమ బోధనపై ప్రభుత్వం మరో నిర్ణయం తీసుకుంది. తొలిదశలో భాగంగా.. 1వ తరగతి నుంచి 6వ తరగతి వరకే వర్తింపజేయాలని ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్లమాధ్యమ బోధనకు పూర్తిస్థాయిలో సన్నద్ధత లేనందున ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఆంగ్ల బోధనపై సీనియర్ అధికారులతో సమావేశమై సమీక్షించిన సీఎం.. ఈ ఆదేశాలు ఇచ్చారు. ప్రతీ ప్రభుత్వ పాఠశాలలోనూ ఆంగ్ల భాషకు చెందిన ప్రయోగశాలను ఏర్పాటు చేయాలని సీఎం స్పష్టం చేశారు. నాడు-నేడులో భాగంగా ఇంగ్లీష్ ల్యాబ్స్ ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రి.. మొదటి దశలో 1 నుంచి 6వ తరగతి వరకూ ఇంగ్లీషు మాధ్యమంలో బోధించాలని స్పష్టం చేశారు. పాఠశాలల్లో సీబీఎస్ఈ, ఐసీఎస్ విధానాలను పాటించాలని సూచించారు.

Intro:Body:Conclusion:
Last Updated :Nov 9, 2019, 4:17 PM IST

ABOUT THE AUTHOR

...view details