దిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి జగన్... కేంద్ర మంత్రి అమిత్ షా ను కలిశారు. నిన్ననే ఒకసారి అమిత్ షాను కలిసిన ఆయన.. ఇవాళ మరోసారి సమావేశమయ్యారు. రాష్ట్ర ప్రాజెక్టులకు సహకారంపై చర్చించారు. అంతకుముందు... కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ను కలిశారు. సీఎం వెంట వైకాపా ఎంపీలు ఉన్నారు. పోలవరం ప్రాజెక్టుకు నిధులు, ఇతర ప్రాజెక్టుల నిర్మాణానికి కేంద్రం సహకారం ఇవ్వాలని కోరారు.
Last Updated : Sep 23, 2020, 10:35 AM IST