ఆంధ్రప్రదేశ్

andhra pradesh

కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాతో సీఎం జగన్‌ భేటీ

By

Published : Sep 22, 2020, 3:07 PM IST

Updated : Sep 22, 2020, 10:20 PM IST

సీఎం జగన్
సీఎం జగన్

19:39 September 22

అమిత్ షాతో ముగిసిన సీఎం జగన్ భేటీ

కేంద్రం హోంమంత్రి అమిత్ షాతో సీఎం జగన్

కేంద్రహోంశాఖ మంత్రి అమిత్‌షాతో సీఎం జగన్ భేటీ ముగిసింది. దాదాపు 50 నిమిషాల పాటు భేటీ కొనసాగింది. విభజన చట్టంలోని హామీల అమలు, పోలవరం, కొవిడ్‌ సహా రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్‌ నిధుల అంశాలను అమిత్‌షాకు సీఎం వివరించారు. ఈ భేటీలో ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు. రాష్ట్రానికి కేంద్రం నుంచి సహకారం అందించాలని అమిత్‌ షాను సీఎం జగన్ కోరారు. 

18:44 September 22

కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాతో ముఖ్యమంత్రి జగన్‌ భేటీ

దిల్లీలో పర్యటిస్తున్న ముఖ్యమంత్రి జగన్‌... కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాతో భేటీ అయ్యారు. అమిత్​ షాను ఆయన నివాసంలో కలిశారు. ఈ భేటీలో పోలవరానికి నిధులు సహా రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై చర్చించనున్నట్లు సమాచారం. రాష్ట్రంలోని తాజా పరిస్థితులను సీఎం జగన్ అమిత్‌షాకు వివరించనున్నారు. దిల్లీ పర్యటనలో సీఎం జగన్‌ వెంట పలువురు వైకాపా ఎంపీలు ఉన్నారు.  

16:25 September 22

దిల్లీ చేరుకున్న ముఖ్యమంత్రి జగన్

  • దిల్లీ చేరుకున్న ముఖ్యమంత్రి జగన్‌
  • ప్రధాని సహా పలువురు కేంద్రమంత్రులను కలిసే అవకాశం
  • రేపు ఉదయం దిల్లీ నుంచి అమరావతి బయల్దేరనున్న సీఎం జగన్‌

16:12 September 22

కాసేపట్లో దిల్లీ చేరుకోనున్న సీఎం జగన్‌

  • కాసేపట్లో దిల్లీ చేరుకోనున్న ముఖ్యమంత్రి జగన్‌
  • ప్రధాని సహా పలువురు కేంద్రమంత్రులను కలిసే అవకాశం
  • రేపు ఉదయం దిల్లీ నుంచి అమరావతి బయల్దేరనున్న సీఎం జగన్‌

14:44 September 22

సీఎం జగన్ దిల్లీ పర్యటన

సీఎం జగన్ దిల్లీ పర్యటన
  • దిల్లీ బయల్దేరిన ముఖ్యమంత్రి జగన్
  • గన్నవరం విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో దిల్లీ పయనం
Last Updated : Sep 22, 2020, 10:20 PM IST

ABOUT THE AUTHOR

...view details